సుప్రీంకోర్టు విచారణ గదుల్లోకి న్యూస్ కెమెరామెన్‌లకు అనుమతి!

సుప్రీంకోర్టు 7 సెషన్ల ప్రత్యేక లోక్ అదాలత్ చరిత్రలో తొలిసారిగా, న్యూస్ కెమెరామెన్‌లను కోర్టు గదుల్లో చిత్రీకరించడానికి అనుమతించింది. 2022లోనే ఈ నిర్ణయం పై ప్రకటించామని..రాజ్యాంగపరమైన విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు వెల్లడించామని సుప్రీంకోర్టు తెలిపింది.

New Update
సుప్రీంకోర్టు విచారణ గదుల్లోకి న్యూస్ కెమెరామెన్‌లకు అనుమతి!

సుప్రీంకోర్టు 7 సెషన్ల ప్రత్యేక లోక్ అదాలత్ చరిత్రలో తొలిసారిగా, న్యూస్ కెమెరామెన్‌లు కోర్టు గదుల్లోని విచారణలను చిత్రీకరించేందుకు అనుమతించింది.గతంలో సుప్రీంకోర్టులో విచారణ ఎలా జరిగుతుందో  ప్రజలకు తెలిసేది కాదు. అయితే, 2022లో సుప్రీంకోర్టు రాజ్యాంగపరమైన విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది.  విచారణలో పారదర్శకత ఉండేలా దీన్ని అమలు చేసినట్టు సుప్రీంకోర్టు తెలిపింది. సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని పలువురు స్వాగతించారు. తద్వారా విచారణలో న్యాయమూర్తులు, న్యాయవాదుల వాదనలను అందరూ తెలుసుకునే వీలుంటుందని వారు పేర్కొంటున్నారు. దీని ద్వారా వార్తా ఛానళ్ల ద్వారా కూడా దర్యాప్తు ప్రక్రియలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

Advertisment
తాజా కథనాలు