Nara lokesh Padha Yatra: రేపు (ఆగస్టు 19) టీడీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్ర విజయవాడలోకి ఎంట్రీ ఇస్తుండగా రాజకీయం రంజుగా మారింది. లోకేశ్ ఫ్లెక్సీలకు అనుమతించేదే లేదంటున్నారు పోలీసులు. విజయవాడలో ఫ్లెక్సీలకి అనుమతి లేదని కార్పొరేషన్ కమిషనర్ మెమో జారీ చేశారు. లోకేశ్ పాదయాత్ర వేళ నాలుగు రోజుల పాటు ఫ్లెక్సీలు, పోస్టర్లు, బ్యానర్లకు అనుమతి నిరాకరిస్తున్నాడు. లోకేశ్ పాదయాత్ర కోసం టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సిబ్బంది తొలగించారు. ఫ్లెక్సీల ఏర్పాటు కోసం అనుమతి కోరుతూ అప్లై చేశారు టీడీపీ కార్పొరేటర్లు.
పూర్తిగా చదవండి..లోకేశ్ పాదయాత్ర వేళ వైసీపీ వర్సెస్ టీడీపీ ఫ్లెక్సీ ఫైట్..!
విజయవాడలో ఫ్లెక్సీ వార్ అంతకంతకూ ముదురుతోంది. రేపు (ఆగస్టు 19) నారా లోకేశ్ పాదయాత్ర విజయవాడలోకి ఎంట్రీ ఇస్తుండడంతో రాజకీయం వేడెక్కింది. నారా లోకేశ్ ఫ్లెక్సీలను అధికారులు తొలగించడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ నాయకులకు భయపడి అధికారులు ఫ్లెక్సీలు తొలగించారని ఆరోపించారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. ఏ ఒక్క అధికారికి ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుందని విమర్శించారు.
Translate this News: