Anitha: హోంమంత్రితో గోడు వెల్లబోసుకున్న మత్సకారులు.. తమ సమస్యను పరిష్కరించాలని కన్నీటిపర్యంతం..!

హోంమంత్రి అనితతో బాపట్ల జిల్లా మత్సకారులు తమ గోడును వెల్లబోసుకున్నారు. రామాపురం గ్రామంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవను వైసీపీ వారు గ్రామ సమస్యగా మార్చి తమపై అక్రమ కేసులు పెట్టారని మత్సకారులు కన్నీటిపర్యంతం అయ్యారు.

Anitha: హోంమంత్రితో గోడు వెల్లబోసుకున్న మత్సకారులు.. తమ సమస్యను పరిష్కరించాలని కన్నీటిపర్యంతం..!
New Update

Home Minister Vangalapudi Anitha: ఆంధ్రప్రదేశ్ సచివాలయం వద్ద హోం మంత్రి వంగలపూడి అనిత కాన్వాయ్ కి బాపట్ల జిల్లా మత్సకారులు (Fishermen) అడ్డుగా వచ్చారు. వెంటనే కాన్వాయ్ అపి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు హోం మినిస్టర్ అనిత. వైసీపీ పాలనలో తమపై అక్రమ కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులు పెట్టారని.. జైళ్లు, కోర్టుల వెంబడి తిప్పారంటూ మత్సకారులు అనిత వద్ద కన్నీటి పర్యాంతం అయ్యారు.

Also Read: వారు మర్యాదగా రాజీనామా చేస్తే బాగుంటుంది.. దాడి రత్నాకర్‌ స్వీట్ వార్నింగ్..!

వేటపాలెం మండలం రామాపురం గ్రామంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవను గ్రామ సమస్యగా మార్చి గ్రామస్తులపై అక్రమ కేసులు పెట్టారని అనితకి గ్రామ మత్సకారులు ఫిర్యాదు చేశారు. వెంటనే హోం మంత్రి బాపట్ల జిల్లా SPతో ఫోన్ లో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో రామా పురం మత్సకారులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే పరిష్కరించాలి ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకున్నందుకు హోం మినిస్టర్ అనితకి రామాపురం గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

#vangalapudi-anitha
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe