Telangana News: అత్తను తుపాకితో కాల్చి చంపిన కానిస్టేబుల్.. హనుమకొండ జిల్లాలో కాల్పుల కలకలం

హనుమకొండ జిల్లా కాల్పుల కలకలం రేపాయి. కేయూ పోలీసు స్టేషన్ పరిధిలోని గుండ్ల సింగారంలో ఒక్కసారిగా కాల్పుల కలకలం సృష్టించింది. అత్తను కానిస్టేబుల్ అడ ప్రసాద్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చి చంపాడు. ఈ ఘటనతో హనుమకొండ జిల్లా ఉలిక్కిపడింది

Telangana News: అత్తను తుపాకితో కాల్చి చంపిన కానిస్టేబుల్.. హనుమకొండ జిల్లాలో కాల్పుల కలకలం
New Update

హనుమకొండ జిల్లా కాల్పుల కలకలం రేపాయి. కేయూ పోలీసు స్టేషన్ పరిధిలోని గుండ్ల సింగారంలో కాల్పుల కలకలం సృష్టించింది. అత్తను కానిస్టేబుల్ అడ ప్రసాద్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చి చంపాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా హనుమకొండ జిల్లా ఉలిక్కిపడింది. రెండు రౌండ్లు కాల్పులు జరిపాడంతో అత్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కాల్పులను గమనించిన స్థానికులు ఆ కానిస్టేబుల్ పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. ప్రసాద్ అనే వ్యక్తి ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరులోని పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పది సంవత్సరాల క్రితం గుండ్లసింగారంకి చెందిన కమల అనే మహిళకి చెందిన పెద్ద కూతురి రమాదేవిని ప్రసాద్‌కి ఇచ్చి పెండ్లి చేశారు. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

విచారణ కొనసాగుతున్న క్రమంలోనే

అయితే.. గత కొంతకాలంగా వీరి మధ్య కుటుంబ గొడవలు ఉన్నా సందర్భంగా పెద్ద కూతురు తల్లి ఇల్లు అయిన గుండ్ల సింగరంలో ఉంటుంది. భార్యాభర్తల మధ్య కలహాలతో మహిళా పోలీస్ స్టేషన్‌లో భార్య ఫిర్యాదు చేసింది. విచారణ కొనసాగుతున్న క్రమంలోనే ఈరోజు ఉదయం ప్రసాద్ కానిస్టేబుల్ విధుల్లో ఉన్నా తన సర్వీస్ రివాల్వర్ వెంట తెచ్చుకుని కూతుర్ని ఇచ్చిన అత్తను కాల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రసాద్ తన డబ్బులు తనకు ఇవ్వాలని అడిగాడు.. ఈ క్రమంలోనే అత్త అల్లుడి మధ్య కొంతసేపు వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో పథకం ప్రకారం రివాల్వర్‌తో అత్తను కాల్చి చంపాడు.. కానిస్టేబుల్ ప్రసాద్‌ను చితక బాదారు.. రాయితో కొట్టారు స్థానికులు. ప్రస్తుతం కాల్పులు జరిపిన ప్రసాద్ తీవ్రగాయాలు కావటంతో ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరించారు. మృతురాలిని ఎంజీఎం మార్చురీకి తరలించారు.

ఇది కూడా చదవండి: భవ్యశ్రీ మృతిపై ఎస్పీ రిషాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!! అసలు ఏలా చనిపోయిందంటే..?

మద్యానికి బానిసైయ్యాడు

ఈ హత్యకు కేవలం అత్త అల్లుడి మధ్య ఆర్థిక లావాదేవీలు కారణంతో పాటు.. భార్యా-భర్తల మధ్య కలహాలతోనే ప్రసాద్ మద్యానికి బానిసైయ్యాడు. భార్య తన బిడ్డలతో తల్లి వద్దే ఉంటోందని స్థానికులు చెబుతున్నారు..అయితే.. ప్రసాద్ చేతికి సర్వీస్ రివాల్వర్ ఎలా వచ్చింది.? ఎక్కడి నుంచి ఈ సర్వీస్ రివాల్వర్ తీసుకొచ్చాడు..? ప్రసాద్‌కు రివాల్వర్ ఎవరు ఇచ్చారు..? అనే కోణంలో విచారణ కొనసాగుతుంది. స్థానిక పోలీసులు రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు.. ప్రసాద్ ఆ రివాల్వర్ తాను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్లో దొంగిలించడా..? లేక ఎవరైనా ఎస్సై లేదా..? ఆపై స్థాయి అధికారుల రివాల్వర్ వారికి చెప్పకుండా తస్కరించాడా..? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం అనువవునా చెకింగ్‌లు కొనసాగుతున్న క్రమంలో తోటపల్లి నుంచి రివాల్వర్‌తో ఎలా ఇంతదూరం తీసుకొచ్చి కాల్పులు జరిపాడు అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన అటు డిపార్ట్మెంట్‌లో.. ఇటు స్థానికంగా ఒక్కసారిగా కలకలం సృష్టించింది.

ఇది కూడా చదవండి: అమిత్‌షాను లోకేష్ కలిసింది అందుకే.. అచ్చెన్నాయుడు సంచలన వాఖ్యలు

#firing-upheaval #hanumakonda-district #killed-his-aunt #constable-prasad
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి