తమిళనాడుకు చెందిన నిత్యానంద అనతికాలంలోనే వేల సంఖ్యలో భక్తులను సంపాదించుకున్నాడు. తన ఆహార్యం, అభినయంతో సోషల్ మీడియాలో వైరల్గా మారాడు. అయితే నిత్యానంద దగ్గర పనిచేసిన కార్ డ్రైవర్ రహస్యంగా చిత్రీకరించిన ఈ స్వామి రాసలీలలు సంచలనం రేపాయి. సినీనటి రంజితతో ఆయన జరిపిన రాసలీలలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈయన అసలు పేరు అరుణాచలం రాజశేఖరన్. తనను తాను దేవుడిగా ప్రకటించుకుని దేశ విదేశాల్లో అనేక గురుకులాలు, ఆశ్రమాలు, దేవాలయాలను స్థాపించాడు. అయితే సినీ నటి రంజిత నిత్యానందకు ఎప్పుడూ వెన్నంటే ఉంటారు. తన అశ్లీల వీడియోలు బయటపడ్డా కూడా నిత్యానంద కార్యక్రమాల్లో అగ్రపీఠం అలంకరిస్తూ ఉంటారు. ఇక రంజిత కైలాస దేశానికి ప్రధానిగా నియమితులయినట్టు తమిళనాడులో కూడా వార్త కథనాలు వచ్చాయి.
పూర్తిగా చదవండి..నిత్యానంద కైలాస దేశానికి ప్రధానిగా సినీనటి రంజిత
నిత్యం రాసలీలల స్వామి, నిత్యం వివాదస్పద వార్తల్లో నిలిచి, దేశం వదిలి పారిపోయి, ఏకంగా తనకోసం కైలాస దేశమని ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకొని ప్రకటించిన ఘనుడు ఇతడు. ఆయనేనండి నిత్యానంద స్వామీజి. గతంలో సినీనటి రంజితతో బెడ్ సీన్లతో రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన స్వామీజీ, ఏకంగా కైలాస అనే దేశాన్ని సృష్టించుకున్నాడు. కాగా.. ఈయన నెచ్చెలి రంజిత ఇప్పుడు ఏకంగా ఆ దేశానికి ప్రధానిగా నియమించినట్టు తన వెబ్సైట్లో పేర్కొన్నాడు.
Translate this News: