మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు రైతన్నలు. హర్యానా కురుక్షేత్రలో కదం తొక్కుతున్నారు. పొద్దు తిరుగుడు పంటకు కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. ఢిల్లీ, హర్యానా నేషనల్ హైవేను దిగ్బంధించారు. కురుక్షేత్ర జిల్లా పిప్లి గ్రామంలో మహా పంచాయత్ నిర్వహించారు. ఐతే వారిని పోలీసులు అడ్డుకోవడంతో..రాత్రంతా రోడ్డుపైనే బైఠాయించారు. అక్కడే వంటా వార్పు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చేవరకు అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుక్కూర్చున్నారు.
పూర్తిగా చదవండి..కదం తొక్కుతున్న రైతులు.. రోడ్డుపైనే వంటా వార్పు
Translate this News: