Farmar sucide: తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య.. భూమి ఆక్రమణకు గురైందంటూ పురుగుల మందు తాగి!

ఖమ్మం జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. జాన్ పహాడ్ తండాకు చెందిన జాటోత్ వీరన్న అనే వ్యక్తి.. తన భూమి అక్రమంగా కబ్జాచేశాడంటూ వెంకట్ రెడ్డి పురుగుల మందు తాగి చనిపోయాడు. సెల్ఫీ సూసైడ్ వీడియో వైరల్ అవుతోంది. వీరన్న కుటుంబాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

New Update
Farmar sucide: తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య.. భూమి ఆక్రమణకు గురైందంటూ పురుగుల మందు తాగి!

Khammam: ఖమ్మం జిల్లా మంత్రి పొంగులేటి ఇలాఖాలో దారుణం జరిగింది. జాన్ పహాడ్ తండాలో తన భూమి ఆక్రమణకు గురైందంటూ మనస్తాపంతో గత ఆదివారం పురుగుల మందు తాగిన రైతు ఏలేటి వెంకట్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తెల్లవారు జామున మృతి చెందాడు. తన మూడెకరాల భూమిని ఆక్రమించి సాగుపనులు చేస్తున్న జాన్ పహాడ్ తండాకు చెందిన జాటోత్ వీరన్న తన మృతికి కారణమంటూ సెల్ఫీ సూసైడ్ వీడియోను పోస్ట్ చేయగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

అసలేం జరిగిదంటే..
ఈ మేరకు 2019 నుంచి ఖమ్మం రూరల్ మండలం జాన్ పహాడ్ తండాలోని ఓమూడెకరాల భూమి విషయంలో జాటోత్ వీరన్నకు అదే గ్రామానికి చెందిన ఏలేటి వెంకటరెడ్డికి మధ్య వివాదం జరుగుతోంది. గతంలో వెంకట్ రెడ్డి సోదరుడు భూపాల్ రెడ్డి తన వద్ద తీసుకున్న అప్పు చల్లించలేదంటూ భూపాల్ రెడ్డి భూమిని కొనుగోలుచేసినట్లు వీరన్న తెలిపాడు. రెవెన్యూ అధికారుల సహాయంతో సరిహద్దులు మార్చుకున్నానన్నాడు. అయితే తన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడంటూ 2021లో పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు వెంకట్ రెడ్డి సోదరుడు భూపాల్ రెడ్డి. దీంతో తమ వ్యవసాయ భూమిని కబ్జా చేశాడంటూ జాటోత్ వీరన్న సహా అతడి కుటుంబసభ్యులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు వెంకట్ రెడ్డి. ఈ క్రమంలో జాటోత్ వీరన్న సహా అతడి కుటుంబ‌ సభ్యులపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది న్యాయస్థానం.

ఇది కూడా చదవండి: Dell Cuts More Jobs : AI ఎఫెక్ట్.. ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చిన ‘డెల్’!

అయితే పోలీసులు కేసు నమోదు చేసినా వీరన్న తీరు మారకపోగా.. ఈనెల 4న మరో మారు తన కుటుంబసభ్యులతో కలిసి వివాదాస్పద భూమిలో సాగుపనులు చెపట్టాడు. దీంతో మనస్తాపంతో పొలం వద్దే పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు వెంకట్ రెడ్డి. మృతుడు వెంకట్ రెడ్డి భార్య ఏలేటి లక్ష్మీ ఫిర్యాధు మేరకు జాటోత్ వీరన్న సహా మరో ఐదుగురిపై ఖమ్మం రూరల్ పోలీసులు కేసునమోదు చేశారు. భూవివాదాల నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆత్మహత్య ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఖమ్మం జిల్లా రైతు భోజడ్ల ప్రభాకర్ మరణం సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. కాగా ఖమ్మం కమిషనరేట్ వ్యాప్తంగా కనీసం రోజుకు మూడు భూవివాదాల కేసులు పోలీస్ స్టేషన్ కు వస్తున్నట్లు సమాచారం. సమస్యల పరిష్కారంలో అధికార యంత్రాంగం వైఫల్యం కారణంగానే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయంటూ ప్రభుత్వంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు