ప్రముఖ మరాఠీ నటుడు రవీంద్ర మహాజనీ అనుమానస్పద స్థితిలో తన ఫ్లాట్ లో శవమై కనిపించాడు. రవీంద్ర తలేగావ్ దభాడేలోని ఆంబిలో ఉన్న జార్బియా సొసైటీలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. ఈ ఫ్లాట్ లో గత ఎనిమిది నెలలుగా ఒంటరిగా ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. కాగా రవీంద్ర మహాజనీ కుమారుడు, నటుడు గష్మీర్ మహాజనీ ముంబైలో ఉంటున్నారు. తన ఫ్లాట్ లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. శుక్రవారం అర్థరాత్రి మహాజనీ ఫ్లాట్ కు వచ్చిన పోలీసులు తలుపు పగలకొట్టి చూడటంతో మహాజనీ శవమై కనిపించారు. రెండు రోజుల క్రితమే మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా మహాజని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే రవీంద్ర మహాజని మృతికి గల కారణాలను పోలీసులు వెల్లడించలేదు.
పూర్తిగా చదవండి..ప్రముఖ నటుడు అనుమానస్పద మృతి..తన ఫ్లాట్లో శవమై కనిపించి..!!
మరాఠ నటుడు రవీంద్ర మహాజనీ అనుమానస్పదంగా మరణించారు. తలేగావ్ లోని తన ప్లాట్ లో శవమై కనిపించాడు. ఒంటరిగా ఉంటుందన్న రవీంద్ర మహాజనీ..రెండు రోజుల క్రితం మరణించి ఉంటారని పోలీసులు తెలిపారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. శుక్రవారం రాత్రి మహాజనీ ఇంటి తలుపులు పగలగొట్టి చూడటంతో మహాజనీ శవమై కనిపించాడు. రవీంద్ర మహాజనీ వయస్సు 77 సంవత్సరాలు. మరఠా చిత్రపరిశ్రమలో హ్యాండ్సమ్ హీరోగా పేరుంది. మరఠా వినోద్ ఖన్నా అని కూడా పిలుస్తారు.
Translate this News: