కాంగ్రెస్‌ నాయకుడిని చెప్పుతో కొట్టిన ఫకీర్‌ బాబా.. వీడియో వైరల్

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు పరాస్‌ సక్లేచా ఓ ఫకీర్ బాబాతో చెప్పు దెబ్బలు కొట్టించుకున్నారు. నేడు మధ్యప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతుండగా రత్లాం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు పరాస్. అయితే గెలుపు సెంటిమెంట్ లో భాగంగా ఇలా చేయగా వీడియో వైరల్ అవుతుంది.

New Update
కాంగ్రెస్‌ నాయకుడిని చెప్పుతో కొట్టిన ఫకీర్‌ బాబా.. వీడియో వైరల్

భారత దేశంలో సెంటిమెంట్ కు చాలామంది జనాలు నమ్ముతారనే విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. కొందరికీ బట్టలు, వెహికిల్స్, ఇళ్లు వంటివాటితో అనుబంధం ఉంటే.. మరికొందరికీ విచిత్రమైన సెంటిమెంట్లు ఉంటాయి. అయితే తాజాగా ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు చేసిన పని ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ ఫకీర్ బాబాతో నడి రోడ్డుమీద చెప్పుదెబ్బలు తిన్న ఓ వింత సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకోగా ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

అసలు విషయానికొస్తే.. నేడు మ‌ధ్యప్రదేశ్ మొత్తం 230 అసెంబ్లీ స్థానాల‌కు అసెంబ్లీ ఎన్నిక‌లకు పోలింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఎన్నికల్లో రత్లాం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పరాస్‌ సక్లేచా పోటీచేస్తున్నారు. అయితే తన గెలుపుకోసం ఓ బాబాతో చెప్పుతో కొట్టించుకున్నారు. పరాస్‌ ముందుగా ఓ జత కొత్త చెప్పులు కొనుక్కొని.. రోడ్డు పక్కన ఉండే ఫకీర్‌ బాబా వద్దకు వెళ్లారు. అతడికి ఆ చెప్పులు ఇచ్చి వాటితో కొట్టించుకున్నారు. తలపై, చెంపపై ఎలాపడితే అలా కొట్టించుకున్నారు. ఈ వింత సెంటిమెంట్ చూసిన జనాలు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలావుంటే.. ఉదయం 6 గంగలకే పోలింగ్‌ ప్రారంభమవగా సాయంత్రం ఆరు గంట‌ల వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. న‌క్స‌ల్ ప్ర‌భావిత ప్రాంతాలైన బాలాఘాట్‌, మండ్ల‌, దిందోరి జిల్లాలో కేవ‌లం 3 గంట‌ల వ‌ర‌కే పోలింగ్ జ‌ర‌గ‌నున్న‌ది. రాష్ట్ర‌వ్యాప్తంగా మొత్తం 64, 626 పోలింగ్ బూత్‌ల‌ను ఏర్పాటు చేశారు. మొత్తంగా 2533 మంది ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తుండగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 47 స్థానాల‌ను ఎస్టీ, 35 స్థానాలు ఎస్సీల‌కు రిజ‌ర్వ్ చేశారు.

Advertisment
తాజా కథనాలు