Telangana : గ్యాంగ్ సినిమా తరహాలో ఫుడ్ ఇన్ స్పెక్టర్లమంటూ రైడ్.. చివరికి ఏం జరిగిందంటే?

ఖమ్మంలో ఫేక్ ఫుడ్ ఇన్ స్పెక్టర్లు అరెస్ట్ అయ్యారు. ఆహార తనిఖీ అధికారులమంటూ నగరంలోని కింగ్ దర్బార్ హోటల్‌లో ఆకస్మిక తనిఖీ చేసి హల్‌చల్ చేశారు. విచారణ నివేదిక అనుకూలంగా ఇవ్వాలంటే రూ. 2లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనుమానం వచ్చిన హోటల్ యజమాని వారిని అరెస్ట్ చేయించారు.

New Update
Telangana : గ్యాంగ్ సినిమా తరహాలో ఫుడ్ ఇన్ స్పెక్టర్లమంటూ రైడ్.. చివరికి ఏం జరిగిందంటే?

Khammam : గ్యాంగ్ (Gang) సినిమా తరహాలో హోటల్‌లో రైడ్ చేసిన ఫేక్ ఫుడ్ ఇన్ స్పెక్టర్లు (Fake Food Inspectors) ఖమ్మంలో అరెస్ట్ అయ్యారు. ఆహార తనిఖీ అధికారులమంటూ నగరంలోని కింగ్ దర్బార్ హోటల్ లో నలుగురు ఫేక్ ఫుడ్ ఇన్ స్పెక్టర్లు ఆకస్మిక తనిఖీ అంటూ హల్ చల్ చేశారు. కుళ్లిపోయిన మాంసం, కాలం చెల్లిన నిత్యావసర సరుకులు వినియోగిస్తున్నారంటూ హోటల్ యజమానిపై ఫైర్ అయ్యారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని మండిపడ్డారు. దీంతో హోటల్ యజమాని బెంబేలిత్తి పోయారు.

మీహోటల్ నిర్వహణలో లోపాలు ఉన్నాయని హైదరాబాద్ (Hyderabad) నుంచి అధికారులు తమను ఆకస్మిక విచారణ చేయమని చెప్పారని కేటుగాళ్లు అన్నారు. విచారణ నివేదిక అనుకూలంగా ఇవ్వాలంటే రూ. రెండు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ సీసీ, జిల్లా ఫుడ్ ఇన్ స్పెక్టర్ కు తలా యాభైవేలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు ఫేక్ ఫుడ్ ఇన్ స్పెక్టర్లు.

Also Read: పర్యావరణ పరిరక్షణకై డిప్యూటీ సీఎం తొలి అడుగు.. ఏం చేశారంటే?

దీంతో అనుమానం వచ్చిన హోటల్ యజమాని స్థానిక ఫుడ్ ఇన్ స్పెక్టర్ కు ఫోన్ కాల్ ద్వారా సమాచారం అందించారు. అయితే, తమ శాఖ నుంచి జిల్లాలో ఆకస్మిక తనిఖీలు ఏమీ లేవని జిల్లా స్థాయి ఆహార తనిఖీ అధికారి కిరణ్ కుమార్ స్పష్టం చేశారు. దీంతో వారు కేటుగాళ్లని గుర్తించి హోటల్ యజమాని జుబేర్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అందిన సమాచారంతో రంగంలోకి దిగిన ఖమ్మం అర్బన్ పోలీసులు నలుగురు కేటుగాళ్లను అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితులు గతంలోనూ ఇలాంటి దాడులకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పట్టుబడిన నిందితులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన గుగులోత్ మోహన్ రావ్, బానోత్ రామస్వామి, సపావత్ యువరాజ్, అజ్మీరా యువరాజ్ సింగ్ గా గుర్తించారు.

Advertisment
తాజా కథనాలు