AP : మాజీ సర్పంచ్‌ భర్త దారుణ హత్య!

కర్నూలు జిల్లా హోసూరులో దారుణ ఘటన జరిగింది. మాజీ సర్పంచ్‌ భర్త శ్రీనివాసులు ఉదయం బహిర్భూమికి వెళ్లిన సమయంలో దుండగులు ఆయన కళ్లలో కారం కొట్టి, వేటకొడవళ్లతో నరికి చంపారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

AP : మాజీ సర్పంచ్‌ భర్త దారుణ హత్య!
New Update

Kurnool : కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ (TDP) నాయకుడు, మాజీ సర్పంచ్ భర్త శ్రీనివాసులును దుండగులు దారుణంగా హత్య (Murder) చేశారు. తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన ఆయన కళ్లలో కారం కొట్టి, వేటకొడవళ్లతో నరికి చంపారు. దీంతో గ్రామంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. మరోవైపు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read: బాక్సింగ్‌ కే జీవితం అంకితమిచ్చా.. ఓటమి తట్టుకోలేకపోతున్నాను!

#ap-tdp #brutally-murder #kurnool
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి