Andhra Pradesh: జగన్‌కు షాక్.. వైసీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా

ఏపీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే శిద్ధా రాఘవరావు వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని పార్టీ చీఫ్ జగన్‌ మోహన్‌ రెడ్డికి పంపారు. వ్యక్తిగత కారణాల వల్లే పార్టీకి రాజీనామా చేశానని రాఘవరావు స్పష్టం చేశారు.

Andhra Pradesh: జగన్‌కు షాక్.. వైసీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా
New Update

Sidda Raghava Rao: ఏపీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే శిద్ధా రాఘవరావు వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని పార్టీ చీఫ్ జగన్‌ మోహన్‌ రెడ్డికి పంపారు. వ్యక్తిగత కారణాల వల్లే పార్టీకి రాజీనామా చేశానని రాఘవరావు స్పష్టం చేశారు. 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2019లో ఒంగోలు ఎంపీకి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర అపజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శిద్ధా రాఘవరావు పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమవుతోంది.

Sidda Raghava Rao

Also Read: జూన్ 19న వైసీపీ విస్తృత స్ధాయి సమావేశం.. ఈ అంశాలపైనే చర్చ!

#andhra-pradesh #ys-jagan #ycp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe