నాలుగు ముహుర్తాల తర్వాత ఐదో ముహుర్తంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు(jupally krishna rao) అధికారికంగా కాంగ్రెస్(congress) కండువా కప్పుకొనున్నారు. ఇవాళ ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(mallikharjuna kharge) సమక్షంలో హస్తం పార్టీలోకి వెళ్లనున్నారు. నిజానికి ఈరోజు జరగాల్సి ఉన్న కొల్లాపూర్(kollapur) సభలో జూపల్లి లక్షల మంది కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ప్రియాంక గాంధీ సమక్షంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ గూటికి చేరాలని భావించినా ప్రస్తుత వాతావరణ పరిస్థితుల సభకు అనూకులంగా లేవని సమాచారం. అందుకే పలుమార్లు కొల్లాపూర్ సభ వాయిదా పడినట్టుగా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..ఇవాళ కాంగ్రెస్లోకి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు.. ఆయనతో పాటే మరికొందరికి కాంగ్రెస్ కండువా..!
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు పలువురు నేతలు ఇవాళ(ఆగస్టు 2) కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న జూపల్లి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఆయన తనయుడు రాజేశ్రెడ్డి, వనపర్తి ఎంపీపీ మేఘారెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి, కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన నాయకుడు శ్రీవర్ధన్ ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు.
Translate this News: