DK Aruna: రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని విమర్శలు గుప్పించారు. అరెస్టులు అవసరం లేకున్నా.. అరెస్ట్ చేసి భయబ్రాంతులకు గురి చేస్తోందంటూ ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అధికార పార్టీ కనుసన్నల్లో నడుస్తోందన్నారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆమె.. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు. గురువారం కామారెడ్డిలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ను పోలీసులు అరెస్ట్ చేశారని, ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్లారో ఇప్పటి వరకు తెలియదని ఆందోళన వ్యక్తం చేశారు డీకే అరుణ. కాసేపటి క్రితమే బిచ్కుంద పోలీస్ స్టేషన్లో హాజరు పరిచారని సమాచారం అందిందని, అసలు ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు అరుణ.
పూర్తిగా చదవండి..DK Aruna: ‘వచ్చేది మన ప్రభుత్వమే.. చూసుకుందాం’.. బీఆర్ఎస్ సర్కార్పై డీకే అరుణ సంచలన కామెంట్స్..
డబుల్ బెడ్ రూం ఇళ్ళ పరిశీలనకు పోకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని అడ్డుకున్నారు.. ఇప్పుడు గజ్వేల్ అభివృద్ధిని చూడకుండా వెంకట రమణా రెడ్డిని అడ్డుకున్నారు.. ఎందుకింత భయం? అరెస్టులతో భయపెట్టాలని చూస్తున్నారా? మీ బెదిరింపులకు భయపడేది లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు డీకే అరుణ.
Translate this News: