మోడీ అప్పుడే చెప్పారు.. కేసీఆర్ గుండెల్లో వణుకు..!

తెలంగాణలో బీజేపీని గెలిపించడమే నాలాంటి సామాన్యుల ఎజెండా అని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. మా సభ చూసి సీఎం కేసీఆర్‌ గుండెల్లో వణుకు మొదలైందన్నారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా.. ఎంత డబ్బులు పెంచినా ఆదిలాబాద్‌లో బీజేపీని ఆదరించేది ఖాయమని ఈటల వ్యాఖ్యానించారు.

New Update
మోడీ అప్పుడే చెప్పారు.. కేసీఆర్ గుండెల్లో వణుకు..!

తెలంగాణలో బీజేపీని గెలిపించడమే నాలాంటి సామాన్యుల ఎజెండా అని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. ఆదిలాబాద్‌లో అమిత్‌ షా యువగర్జన సభ విజయవంతం అయిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్‌ టీవీతో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. సభకు వచ్చిన యువకుల కేరింత, ప్రజల ఆదరాభిమానాలు చూస్తే ఆదిలాబాద్‌లో నూటిని నూరు శాతం గెలిచేది బీజేపీనే అని ఈటల తెలిపారు. మా సభ చూసి సీఎం కేసీఆర్‌ గుండెల్లో వణుకు మొదలైందన్నారు. ఇతర పార్టీల సభలు కూడా సక్సెస్‌ అవుతాయని.. కానీ అన్నీ ఇచ్చి అరువు తెచ్చుకున్న బాపతు వాళ్లదని.. గుండెల నిండా బీజేపీని పెట్టుకుని తరలివచ్చిన జనం వీళ్లని తెలిపారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా.. ఎంత డబ్బులు పెంచినా ఆదిలాబాద్‌లో బీజేపీని ఆదరించేది ఖాయమని ఈటల వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఎప్పుడో ఎన్నికల వాతావరణం వచ్చిందని.. మోదీ నేషనల్ ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలోనే ఇక్కడ ఎన్నికల నగారా మోగించారని.. బీజేపీ గెలవాలని మార్గనిర్దేశం చేశారని తెలిపారు. అప్పటి నుంచే తమ కార్యాచరణ మొదలైందని, బీజేపీని గెలిపించడమే నాలాంటి సామాన్యుడి ఎజెండా అని తెలిపారు.

Advertisment
తాజా కథనాలు