జమ్మూకశ్మీర్లో భద్రతా బలగాలు ఘనవిజయం సాధించాయి. కుప్వారా జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన ఆపరేషన్లో 5 మంది ఉగ్రవాదులను హతమార్చారు. ఈ ఉగ్రవాదులంతా పాకిస్థాన్ కు చెందినవారిగా గుర్తించారు. ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం ఆధారంగా భద్రతా బలగాలు, జమ్మూ కశ్మీర్ పోలీసులు ఈ ఉదయం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా టెర్రరిస్టులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు టెర్రరిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ప్రస్తుతం కుప్వారా జిల్లా వ్యాప్తంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
పూర్తిగా చదవండి..జమ్మూకశ్మీర్లో భారీ ఎన్కౌంటర్, ఐదుగురు ఉగ్రవాదులు హతం..!!
Translate this News: