Emmission Norms: ఆ కార్ల కంపెనీలకు వందల కోట్ల జరిమానా విధించే ఛాన్స్.. ఎందుకంటే..

ఉద్గార నిబంధనలు (Emmission Norms) ఉల్లంఘించడంతో పెద్ద కార్ల కంపెనీలకు కోట్లాది రూపాయల జరిమానా విధించాలని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రభుత్వం కూడా నిబంధనలు పాటించని సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతోంది. 

Emmission Norms: ఆ కార్ల కంపెనీలకు వందల కోట్ల జరిమానా విధించే ఛాన్స్.. ఎందుకంటే..
New Update

మన దేశంలో చాలా పెద్ద కార్ల కంపెనీలు ఉద్గార నిబంధనలు (Emmission norms) పాటించడం లేదని ప్రభుత్వం గుర్తించింది.  జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం హ్యుందాయ్, కియా, హోండా కార్స్, రెనాల్ట్, స్కోడా ఆటో, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా - నిస్సాన్‌తో సహా ఇతర కార్ల తయారీదారులు తప్పనిసరి ఉద్గార నిబంధనలను పాటించడం లేదని ప్రభుత్వం గుర్తించింది.

ఉద్గార నిబంధనల(Emmission Norms)ను సరిగ్గా పాటించని కార్ల తయారీ కంపెనీలపై వందల కోట్ల రూపాయల జరిమానా విధించాలని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సిఫారసు చేసింది. 

కార్లలో తక్షణ మెరుగుదలలు చేయాలని సిఫార్సు

కార్లలో తక్షణమే మెరుగులు దిద్దాలని తయారీ కంపెనీలకు బీఈఈ సిఫార్సు చేసింది. దీనితో పాటు తక్కువ కాలుష్యం వ్యాపించే, గ్రీన్ ఎనర్జీని వినియోగించే వాహనాలను తయారు చేయాలని కోరింది. 

ఢిల్లీ-NCR సహా అనేక ఇతర నగరాలు ప్రమాదకరమైన కాలుష్యంతో పోరాడుతున్నాయి.

ఢిల్లీ-NCR, ముంబై, పంజాబ్ - హర్యానాతో సహా అనేక ఇతర నగరాలు ప్రమాదకరమైన కాలుష్య స్థాయిలను ఎదుర్కొంటున్న సమయంలో తప్పనిసరి ఉద్గార నిబంధనలను పాటించనందుకు జరిమానాలు విధించాలని BEE సిఫార్సు చేసింది. 

AQI సంఖ్యలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో సుప్రీంకోర్టు కూడా కాలుష్యాన్ని సీరియస్‌గా తీసుకుంది - దానిని తగ్గించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్రాన్ని - కేంద్రాన్ని కోరింది. దీంతో పాటు జరిమానా విధించాలని కోరారు.

Also Read: గాల్లో రయ్.. రయ్యంటూ గమ్యస్థానానికి.. ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ వచ్చేస్తోంది 

ఎనర్జీ కన్జర్వేషన్ సవరణ 2022 ప్రకారం, నిబంధనల కంటే ఎక్కువ కార్బన్‌ను విడుదల చేసే కార్లను తయారు చేసే ఏ కంపెనీ అయినా భారీ జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది . దీనితో పాటు, ఈ ఏడాది జనవరి నుంచి దేశంలో కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ (CAFE) స్టాండర్డ్‌ని అప్‌గ్రేడ్ చేశారు.   దీని లక్ష్యం వాహన ఉద్గారాలను తప్పనిసరిగా తగ్గించడం.

ఉద్గార నిబంధనలు ఉల్లంఘించి విక్రయించే  ఒక్కో యూనిట్‌ వాహనాలపై రూ.25 వేలు జరిమానా విధించే నిబంధన ఉంది. 4.7 గ్రాముల కంటే ఎక్కువ ఉద్గారాలను విక్రయించే ప్రతి వాహనంపై రూ.50 వేలు జరిమానా విధించే నిబంధన ఉంది.

హోండాకు రూ. 103 కోట్ల జరిమానా విధించవచ్చు.బీఈఈ

ప్రాథమిక లెక్కల ప్రకారం, హోండా కార్లు రూ. 103 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.  ఎందుకంటే దాని ఉద్గారాలు తప్పనిసరి ఉద్గారాల కంటే 17 యూనిట్లు ఎక్కువ. దీనితో పాటు రెనాల్డ్స్ రూ.75 కోట్లు, నిస్సాన్ రూ.41 కోట్లు, స్కోడా రూ.59 కోట్లు, ఫోర్స్ మోటార్స్ రూ.0.7 కోట్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

Watch this interesting video:

#emmission #air-polution
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe