అస్సాం(Assam)లో గజరాజుల మరణాలు ఆగడంలేదు.. ప్రతి ఏడాది అక్కడ ఏనుగుల(Elephants) సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. తాజాగా మరో రెండు ఏనుగులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. నాగోవ్ జిల్లాలో ఉన్న ఓ పర్వతం కింద రెండు ఏనుగులు చనిపోయి కనిపించాయి. అందులో ఒక ఆడ ఏనుగు కూడా ఉంది. ఏనుగుల మృతదేహాలను గుర్తించిన గ్రామస్తులు అటవీ శాఖకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది.. గజేంద్రుల మరణాలపై దర్యాప్తు ప్రారంభించారు. నాగావ్(Nagaon) జిల్లాలో ఏనుగులు మృతి చెందడం ఇదే మొదటిసారి కాదు. మే 2021లో, పిడుగుపాటు వల్ల ప్రమాదవశాత్తూ 18 ఏనుగులు మరణించాయి. ఏనుగుల మరణాల విషయంలో అస్సాం నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. అసలు ప్రతి ఏడాది అక్కడ పదుల సంఖ్యలో ఏనుగులు ఎందుకు చనిపోతున్నాయి…?
పూర్తిగా చదవండి..Elephants death: అస్సాంలో మరో రెండు ఏనుగులు మృతి… ఈశాన్య రాష్ట్రంలో గజరాజుల మరణాలకు కారణాలేంటి?
అస్సాంలో మరో రెండు ఏనుగులు మరణించాయి. నాగోవ్ జిల్లాలో ఉన్న ఓ గ్రామంలో రెండు ఏనుగులు చనిపోయి కనిపించగా అక్కడి గ్రామస్తులు అధికారులకు సమాచారం అందించారు. చనిపోయిన ఏనుగుల్లో ఓ ఆడ ఏనుగు కూడా ఉంది.
Translate this News: