Elections 2024: మొన్న శ్రీనగర్.. ఇప్పుడు బారాముల్లా.. 40 ఏళ్ల రికార్డ్ బ్రేక్.. భారీ పోలింగ్!

లోక్‌సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్‌ లో జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లా రికార్డ్ బ్రేక్ చేసింది. ఇక్కడ 54.21 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇది 40 ఏళ్లలో అత్యధిక పోలింగ్ శాతం. అధికారికంగా ఇంకా లెక్కలు వెల్లడి కావలసి ఉంది. ఈ నేపథ్యంలో పోలింగ్ శాతం పెరిగే ఛాన్స్ ఉంది. 

New Update
Elections 2024: మొన్న శ్రీనగర్.. ఇప్పుడు బారాముల్లా.. 40 ఏళ్ల రికార్డ్ బ్రేక్.. భారీ పోలింగ్!

Elections 2024: లోక్‌సభ ఎన్నికల ఐదో దశ పోలింగ్‌ పూర్తయింది. 8 రాష్ట్రాల్లోని 49 స్థానాల్లో దాదాపు 57.47 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ దశలో చాలా స్థానాల్లో చరిత్రాత్మక ఓటింగ్ కూడా నమోదైంది. జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లాలో 40 ఏళ్ల నాటి ఓటింగ్ రికార్డు బ్రేకయింది.  సాయంత్రం 5 గంటల వరకు బారాముల్లాలో 54.21 శాతం ఓటింగ్ నమోదైంది. అయితే పూర్తి లెక్కలు  ఇంకా వెల్లడి కాలేదు. ఇటువంటప్పుడు  బారాముల్లాలో ఓట్లు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

శ్రీనగర్ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 38.49 శాతం పోలింగ్ నమోదైన తర్వాత, బారాముల్లాలో గత 8 లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్‌ నమోదైందని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. బారాముల్లా, కుప్వారా, బందిపోరా, బుద్గాం జిల్లాల్లో సాయంత్రం 5 గంటల వరకు 54.21 శాతం ఓటింగ్ నమోదైందని ఆ ప్రకటనలో పేర్కొంది. బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గంలో ఈసారి 2103 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం కాగా రోజంతా ఓటర్లు పోలింగ్ బూత్‌లకు వస్తూ పోతూనే ఉన్నారు. కొన్ని చోట్ల పొడవాటి క్యూలు కూడా కనిపించాయి.

2019 ఎన్నికల తర్వాత ఆర్టికల్ 370 రద్దు చేశారు..
Elections 2024: 2019లో బారాముల్లా లోక్‌సభ స్థానంలో 34.6 శాతం ఓటింగ్ జరిగింది.  ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత అంటే 5 ఆగస్టు 2019న జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో జమ్మూ-కశ్మీర్, లడఖ్ రెండు భాగాలుగా విడిపోయాయి. ప్రస్తుతం రెండూ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్నాయి. అలాగే, 1989 లోక్‌సభ ఎన్నికల్లో బారాముల్లా స్థానంలో అతి తక్కువగా  కేవలం 5.48 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది.

Elections 2024: ఈసారి బారాముల్లా స్థానం నుంచి 22 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాతో పాటు పీపుల్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సజ్జాద్ గని లోన్ కూడా పోటీలో ఉన్నారు. షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్ కూడా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. రషీద్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు.

Also Read: ముగిసిన లోక్‌సభ ఐదో దశ ఎన్నికలు.. పోలింగ్ శాతం ఎంతంటే

నాలుగో దశలో శ్రీనగర్‌లో రికార్డు బ్రేక్..
Elections 2024: అంతకుముందు నాలుగో దశ ఎన్నికల్లో శ్రీనగర్‌లో 38.49 శాతం ఓటింగ్ నమోదైంది, ఇది 1996 తర్వాత అత్యధికం. ఈ విధంగా చూస్తే, ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో ఇది మొదటి సార్వత్రిక ఎన్నికలు. తొలి సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ ఓటింగ్ జరగడం కేంద్ర పాలిత ప్రాంతానికి మంచి సంకేతమని భావిస్తున్నారు.

ఐదు దశలు - 428 స్థానాలకు పోలింగ్ పూర్తి..
Elections 2024: కాగా, ఐదో దశలో ఓటింగ్‌ గురించి చూస్తే 57.47 శాతం ఓటింగ్‌ నమోదైంది. దీంతో ఇప్పటి వరకు 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, 428 లోక్‌సభ స్థానాలకు లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు రెండు దశల ఎన్నికలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇందులో ఆరో దశకు మే 25న, ఏడో దశకు జూన్‌ 1న పోలింగ్‌ జరగనుంది. దీని తర్వాత జూన్ 4న లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.

  • నాల్గవ దశలో 69.16 శాతం ఓటింగ్ జరిగింది.  ఇది 2019 ఎన్నికల అదే దశ కంటే 3.65 శాతం ఎక్కువ.
  • మూడో దశకు 65.68 శాతం ఓటింగ్ నమోదు కాగా, 2019 మూడో దశ ఎన్నికల్లో 68.4 శాతం నమోదైంది.
  • రెండో దశలో 66.71 శాతం ఓటింగ్ జరగగా, 2019లో ఈ సంఖ్య 69.64 శాతంగా నమోదైంది.
  • తొలి దశలో 66.14 శాతం ఓటింగ్‌ నమోదు కాగా, 2019 ఎన్నికల్లో తొలి దశలో 69.43 శాతం ఓటింగ్‌ నమోదైంది.
Advertisment
తాజా కథనాలు