TDP-YCP: ఆచంట నియోజకవర్గంలో ఎన్నికల వేడి.. పోటా పోటీగా టీడీపీ వైసీపీ ప్రచారాలు.!

పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో ఎన్నికల వేడి మొదలైంది. గెలుపే లక్ష్యంగా పోటాపోటీగా పనిచేస్తున్నారు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, వైసీపీ ఎమ్మెల్యే రంగనాథ రాజు. నువ్వా నేనా అనే రీతిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

TDP-YCP:  ఆచంట నియోజకవర్గంలో ఎన్నికల వేడి..  పోటా పోటీగా టీడీపీ వైసీపీ ప్రచారాలు.!
New Update

West Godavari district: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అటు టీడీపీ ఇటు వైసీపీ నేతలు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో ఎన్నికల వేడి మొదలైంది. నువ్వా నేనా అనే రీతిలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, వైసీపీ ఎమ్మెల్యే రంగనాథ రాజు ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకవైపు నియోజకవర్గంలో ఇంటింటికి పితాని కార్యక్రమంతో గ్రామాల్లోకి వెళ్తు ప్రజలను పరామర్శిస్తున్నారు టిడిపి మాజీ మంత్రి పితాని.

Also Read: ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిపై నిప్పులు చెరిగిన టీడీపీ ఇంచార్జ్ మీనాక్షి నాయుడు

మరోవైపు తన కార్యాలయం వద్ద సమావేశం ఏర్పాటు చేసి ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా డ్వాక్రా మహిళలతో వైసీపీ ఎమ్మెల్యే రంగనాథరాజు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. మనసారా ఆసరా అనే కార్యక్రమం చెప్పట్టి మహిళలకు విందు ఏర్పాటు చేశారు. ఆ తరువాత బహుమతిగా చీరను కూడా ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలకు ప్రభుత్వం ఏం చేసింది? నియోజకవర్గంలో తను ఏం చేశారో మహిళలకు వివరించారు ఎమ్మెల్యే రంగనాథరాజు. రోజుకు ఐదు వేల మంది మహిళలతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

Also Read: కుటుంబ తగాదాలు ఉంటే వ్యక్తి గతంగా మాట్లాడుకోవాలి..ఇలా కాదు.. షర్మిలకు కొడాలి నాని కౌంటర్..!

ఇదిలా ఉండగా.. వైసీపీ ఓటమి ఖాయం..జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం తధ్యం అంటూ పలువురు టీడీపీ నేతలు, జనసైనికులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారని 175కి 175 సీట్లు తమవేనంటూ వైసీపీ నేతలు గెలుపు ధీమాతో చూపిస్తున్నారు.

#west-godavari-district #andhra-pradesh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe