Election Guarantees: హామీలు.. గ్యారెంటీలే నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రభావం చూపించాయా?

ఎన్నికలు అనగానే రాజకీయ పార్టీల హామీల సునామీ.. పథకాల వర్షం కురవడం ప్రారంభం అవుతుంది. నిన్న ఫలితాలు వచ్చిన నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన హామీలు వర్కౌట్ అయ్యాయనే చెప్పవచ్చు. 

Election Guarantees: హామీలు.. గ్యారెంటీలే నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రభావం చూపించాయా?
New Update

Election Guarantees:  మన దేశంలో ఎన్నికలు ఎప్పుడు.. ఎక్కడ వచ్చినా హామీల వర్షం తప్పదు. ఇటీవల కాలంలో ప్రజలకు నేరుగా నగదు బదిలీ విధానంలో పథకాల హామీలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇప్పుడు జరిగిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ అన్ని పార్టీలు నగదు బదిలీ లాంటి పథకాలు ప్రకటించాయి. అయితే, వాటిలో ఆకర్షణీయంగా కనిపించిన పథకాలకు.. వాటిని ప్రకటించిన పార్టీలకు జై కొట్టారు ప్రజలు. చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణలో ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలు లేదా వాటికి సంబంధించిన హామీలు బిజెపి, కాంగ్రెస్ ల విజయంలో పెద్ద పాత్ర పోషించాయి.

మధ్యప్రదేశ్లో శివరాజ్ చౌహాన్ లాడ్లీ బెహనా యోజన(Election Guarantees) మొత్తం 5.06 కోట్ల మంది ఓటర్లలో 2.7 కోట్ల మంది మహిళా ఓటర్లను బీజేపీ వైపు తీసుకురాగా, తెలంగాణలో కాంగ్రెస్ ఆరు హామీ పథకాలు అద్భుతాలు చేశాయి. ఛత్తీస్ గఢ్ లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ (పీఎస్సీ) పరీక్షల కుంభకోణం, బొగ్గు సేకరణ, అక్రమ మద్యం అమ్మకాలు, మహదేవ్ యాప్ కేసులో ఈడీ దాడులు బీజేపీ విజయానికి దోహదపడ్డాయి.

మధ్యప్రదేశ్ లో..

2018లో లేదా గత పదేళ్లుగా బీజేపీ ఓడిపోతున్న మధ్యప్రదేశ్లో 4 నెలల క్రితం 39 మంది అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు ఎన్నికలకు నెల రోజుల ముందు అంటే అక్టోబర్ 15న కాంగ్రెస్ తన తొలి జాబితాను విడుదల చేసింది. బీజేపీ అభ్యర్థులు బలహీనమైన స్థానాల్లో పనిచేస్తుంటే, కాంగ్రెస్ లో టిక్కెట్ల కోసం టగ్ ఆఫ్ వార్ జరిగింది. బీజేపీ ఎన్నికల ప్రచారంతో సంబంధం ఉన్న ఓ సీనియర్ నేత చెప్పినదాని ప్రకారం.. సంస్థాగత బలంతోనే ఈ ఎన్నికల్లో గెలీచింది బీజేపీ.  పోలింగ్ రోజున ఉదయం 8 గంటల నుంచే 90 శాతానికి పైగా పోలింగ్ కేంద్రాలు పనిచేయడం ప్రారంభించాయి. సీఎం శివరాజ్ ను పక్కన పెట్టాలని నాయకత్వం నిర్ణయం తీసుకుంది.   మధ్యప్రదేశ్ లో బిజెపి ఘన విజయం సాధించడానికి, కాంగ్రెస్ ఓటమికి ఇతర కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణం(Election Guarantees) అక్కడ లాడ్లీ బెహనా పథకం.  ఈ లాడ్లీ బహనా పథకం ద్వారా మహిళలకు నేరుగా ఇస్తున్న నెలవారీ మొత్తాన్ని రూ.3 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఎంపీలో మొత్తం 5.06 కోట్ల మంది ఓటర్లలో 2.7 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 74% మంది మహిళలు ఓటు వేశారు. అందువల్ల పార్టీ మహిళా ఓటర్లను తన గూటికి తీసుకురావడానికి లాడ్లీ బెహనా పథకంలో మొత్తాన్ని పెంచడాన్ని ఎంచుకుంది. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.

రాజస్థాన్ లో..

రాజస్థాన్ విషయానికి వస్తే..(Election Guarantees) ఇక్కడ ఉచిత వైద్యం కోసం చిరంజీవి పథకం, ఉచిత మొబైల్, ఓపీఎస్ వంటి పథకాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపాయి. చాలా పథకాలు ఆలస్యంగా లబ్ది పొంది ఉండవచ్చు, కానీ స్వల్ప ప్రభావం చూపింది.  ఇది కాంగ్రెస్ కు గౌరవప్రదమైన ఓటమికి దారితీసింది. బీజేపీ దూకుడు వ్యూహం.. సనాతన, హిందుత్వ అంశాలతో పాటు యువతపై పార్టీ దృష్టి సారించింది. లాల్ డైరీ ద్వారా నిరుద్యోగం, అవినీతి సమస్యను లేవనెత్తారు. ఇవన్నీ బీజేపీకి ఇక్కడ ప్రజలు పట్టం కట్టడంలో ప్రధానంగా పనిచేశాయి. 

Also Read: ఏ మాత్రం ఆశలు లేని మధ్యప్రదేశ్ లో బీజేపీ విజయం ఎలా సాధ్యం అయింది?

ఛత్తీస్ గఢ్ లో

ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్ర పరిస్థితి(Election Guarantees) ఇందుకు భిన్నంగా ఉంది. ఇక్కడ పథకాల కంటే.. అవినీతిపై యుద్ధం అనే విధానాన్ని బీజేపీ పైకి తీసుకువచ్చింది. అంతేకాకుండా ఎక్కడికక్కడ స్థానిక సమస్యలపై హామీలు ఇస్తూ పోయారు. బీజేపీ ఈ ఎన్నికల్లో మొత్తం దృష్టిని భూపేష్ బఘేల్ ప్రభుత్వ అవినీతి చుట్టూనే ఉంచింది. దీంతో పాటు రైతులు, విద్యార్థులను ఆకట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నించింది. కవార్ధా, బెమెతారాలో మతపరమైన సమస్యలు, బస్తర్ లో గిరిజనుల మతమార్పిడి సమస్యపై బీజేపీ పోరాడింది.  బిజెపి సిఎంఎవరనేది చెప్పకుండానే ఎన్నికలలో పోటీ చేసింది. గెలుపు సాధించింది. ఇది ప్రజలు బఘేల్ వాగ్దానాలను విశ్వసించలేదని, కానీ మోదీ హామీని విశ్వసించారని స్పష్టంగా చూపిస్తుంది.

తెలంగాణలో.. 

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ విజయానికి ఆ పార్టీ చెప్పిన ఆరు గ్యారెంటీలు(Election Guarantees) పెద్ద కారణంగా చెప్పవచ్చు. మిగిలిన అంశాలు ఎలా ఉన్నా.. ఈ ఆరు గ్యారెంటీలు ప్రజలలో బాగానే వెళ్లిపోయాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఆరు గ్యారెంటీలు అమలు కావు అని నెగెటివ్ ప్రచారం చేయడం ఈ పథకాలు ప్రజల్లో ఆదరణ పొందుతాయనే భయాన్ని సూచించింది.  ఈ ఆరు హామీలు "మహాలక్ష్మి", "రైతు భరోసా", "గృహ జ్యోతి", "ఇందిరమ్మ ఇండ్లు", "యువ వికాసం" అలాగే "చేయుత". ఇప్పటికే ఇదే రకమైన హామీలతో కర్ణాటకలో కూడా విజయాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ సరిగ్గా అదే వ్యూహాన్ని తెలంగాణలో కూడా అమలు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. 

పథకాల్లో.. హామీల్లో (Election Guarantees)  సాధ్యాసాధ్యాల మాట ఎలా ఉన్నా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు గాలం వేయడానికి ఇవి సరిపోతాయి. మన దేశంలో చాలా సార్లు ఇది రుజువు అయింది. ఎన్నికల్లో ఇచ్చే హామీలు అన్నీ నెరవేరుస్తారా? లేదా? అనేది తరువాతి విషయం.. స్థానిక సమస్యలు.. ప్రభుత్వ వ్యతిరేకత.. నాయకత్వంపై అసంతృప్తి ఇలాంటి రకరకాల కారణాలతో ఎవరికీ ఓటు వేయాలి అని ఆలోచిస్తూ ఉండే ఓటర్లను గట్టిగా ఆకర్షించడంలో ఈ ఉచిత పథకాలు.. హామీలు ఎప్పుడూ సక్సెస్ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఈ నాలుగు రాష్ట్రాల్లోనూ కూడా వీటి ప్రభావాన్ని తీసిపారేయలేం.

Watch this interesting Video:

#5-state-elections-2023 #election-guarantees
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి