భారతదేశంలోని (Bharath) కొన్ని ప్రాంతాల్లో సోమవారం ఉదయం భూమి కంపించింది. ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని ఉత్తర కాశీలో ఈరోజు ఉదయం 8.35 నిమిషాల సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది(Earth Quake). భూకంప లేఖిని పై భూకంప తీవ్రత 3.0 గా నమాదు కాగా..భూమి లోపల 5 కిలో మీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
ఇదిలా ఉండగా సోమవారం ఉదయం బంగాళాఖాతంలో కూడా భూమి కంపించింది. దాని తీవ్రత 4.3 గా నమోదు అయ్యింది.
ఇదిలా ఉండగా అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా భూమి లోతులో 37 కిలోమీటర్లు అడుగున భూకంపం చోటు చేసుకుంది.
దీని గురించి ఎన్సీఎస్ వెల్లడించింది. సోమవారం అర్థరాత్రి దాటిన తరువాత 2.31 గంటల ప్రాంతంలో ఈ భూకంపం చోటు చేసుకుంది. ప్రస్తుతం భూకంప కేంద్రం అండమాన్ సముద్రంలో ఉన్నదని తెలిపింది.
news item updated soon...