EAPCET Counselling: ఈరోజు నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్

TG: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్ల కేటాయింపు కోసం నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియ ఈరోజు ప్రారంభం అయింది. ఈరోజు నుంచి విద్యార్థులు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.ఈ ఏడాది ఇంజనీరింగ్ విభాగం నుంచి 1,80,424 మంది అర్హత సాధించారు.

New Update
EAPCET Counselling: ఈరోజు నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్

EAPCET Counselling:తెలంగాణలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్ల కేటాయింపు కోసం నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియ ఈరోజు ప్రారంభం అయింది. ఈరోజు నుంచి విద్యార్థులు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. https://tgeapcet.nic.in అనే వెబ్ సైట్ లో లాగిన్ అయి రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ చేసుకోవాలని ఈఏపీసెట్ కౌన్సెలింగ్ క్యాంప్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ ఏడాది జరిగిన ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో ఇంజనీరింగ్ విభాగం నుంచి 1,80,424 మంది అర్హత సాధించినట్లు ఆయన చెప్పారు. వీళ్లంతా కౌన్సెలింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. ర్యాంకు ఆధారంగా కన్వీనర్ కోటా సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు