TS: కూలిన భారీ వృక్షం.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి..!

ములుగు జిల్లా చిన్నబోయినపల్లిలో భారీ వృక్షం కూలి మీద పడడంతో వ్యక్తి మృతి చెందాడు. జహంగీర్‌ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నాడు. అతను బోయిన పల్లి వద్దకు రాగానే ఒక్కసారిగా భారీ వృక్షం కూలి మీద పడింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

New Update
TS: కూలిన భారీ వృక్షం.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి..!

TS: తెలంగాణలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. రహదారులన్నీ జలమయం అయ్యాయి. వరదలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. అంతేకాకుండా మరికొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

తాజాగా, ములుగు జిల్లా చిన్నబోయినపల్లిలో భారీ వృక్షం కూలి పడడంతో వ్యక్తి మృతి చెందాడు. జహంగీర్‌ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నాడు. అతను బోయిన పల్లి వద్దకు రాగానే ఒక్కసారిగా భారీ వృక్షం కూలి తనపై పడింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Advertisment
తాజా కథనాలు