రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం సాయంత్రం దంచి కొట్టిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ చెరువుల్లా మారాయి. ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. నాలాలు ఉప్పొంగుతున్నాయి. వాటి పరిసర ప్రాంతాల్లో ఉండేవారు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. ఎక్కడ చూసినా బురదే.
పూర్తిగా చదవండి..దంచి కొట్టిన వర్షానికి..చెరువుల్లా మారిన లోతట్టు ప్రాంతాలు!
నిజామాబాద్ జిల్లాలో కూడా సోమవారం కుండపోత వర్షం కురిసింది. అర్థరాత్రి వేల్పురు, పెర్కిట్, భీంగల్, జక్రాన్ పల్లి, కోర్ ట్ పల్లిలో రికార్డు స్థాయిలో వర్షం పడింది. వేల్పుర్ లో అత్యధికంగా 46 సెంటిమీటర్లు, పెర్కిట్ లో 33, భీంగల్ లో 26, జక్రాన్ పల్లిలో 22 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.
Translate this News: