దంచి కొట్టిన వర్షానికి..చెరువుల్లా మారిన లోతట్టు ప్రాంతాలు!

నిజామాబాద్ జిల్లాలో కూడా సోమవారం కుండపోత వర్షం కురిసింది. అర్థరాత్రి వేల్పురు, పెర్కిట్, భీంగల్, జక్రాన్ పల్లి, కోర్ ట్ పల్లిలో రికార్డు స్థాయిలో వర్షం పడింది. వేల్పుర్ లో అత్యధికంగా 46 సెంటిమీటర్లు, పెర్కిట్ లో 33, భీంగల్ లో 26, జక్రాన్ పల్లిలో 22 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.

New Update
దంచి కొట్టిన వర్షానికి..చెరువుల్లా మారిన లోతట్టు ప్రాంతాలు!

రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం సాయంత్రం దంచి కొట్టిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ చెరువుల్లా మారాయి. ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. నాలాలు ఉప్పొంగుతున్నాయి. వాటి పరిసర ప్రాంతాల్లో ఉండేవారు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. ఎక్కడ చూసినా బురదే.

Due to the torrential rain, the lowlands have become ponds!

ఇక నిజామాబాద్ జిల్లాలో కూడా సోమవారం కుండపోత వర్షం కురిసింది. అర్థరాత్రి వేల్పురు, పెర్కిట్, భీంగల్, జక్రాన్ పల్లి, కోర్ ట్ పల్లిలో రికార్డు స్థాయిలో వర్షం పడింది. వేల్పుర్ లో అత్యధికంగా 46 సెంటిమీటర్లు, పెర్కిట్ లో 33, భీంగల్ లో 26, జక్రాన్ పల్లిలో 22 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.

దీంతో లోతట్టు ప్రాంతాలు చెరువుల్లా మారాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. చెరువులన్నీ నిండుకుండల్లా మారాయి. అయితే ఈ వర్షాకాలం సీజన్లోనే సోమవారం అర్థరాత్రి అతి భారీ వర్షం కురిసిందని అన్నదాతలు చెబుతున్నారు. ఇక ఆర్మూర్ నియోజకవర్గంలో కూడా పలుచోట్ల రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది.

దీంతో లోతట్టు కాలనీల్లో భారీగా వర్షపు నీరు చేరడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా భారీ వర్షాలకు వేల్పూర్ సాహెబ్ పెట్ గ్రామాల మధ్య కల్వర్టు తెగిపోయింది. దీంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వేల్పూర్ మసర్ కుంట చెరువు కట్ట తెగిపోయింది. ఆర్మూర్ భీంగల్ రహదారిపై నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పాడ్డాయి.

అయితే మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించడంతో రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు