Drugs: డ్రగ్స్‌.. డోర్‌ డెలివరీ!

హైదరాబాద్ మహానగరంలో జరుగుతున్న డ్రగ్స్ దందాలో కొత్త కోణం మరోసారి కలకలం రేపింది. సోషల్ మీడియా (Social Media) ద్వారా డ్రగ్స్ విక్రయాల ఆర్డర్లను తీసుకుంటూ, డోర్‌ డెలివరీ చేస్తున్న ముఠాను తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు.

New Update
Drugs: డ్రగ్స్‌.. డోర్‌ డెలివరీ!

Drugs: హైదరాబాద్ మహానగరంలో జరుగుతున్న డ్రగ్స్ దందాలో కొత్త కోణం మరోసారి కలకలం రేపింది. సోషల్ మీడియా (Social Media) ద్వారా డ్రగ్స్ విక్రయాల ఆర్డర్లను తీసుకుంటూ, డోర్‌ డెలివరీ చేస్తున్న ముఠాను తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. యాంటీ నార్కొటిక్స్ బ్యూరో ఎస్పీ గుమ్మ చక్రవర్తి శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. సూరారంలో పోలీసులతో పాటు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద 60 గ్రాముల క్రిస్టల్ మెథాం ఫెటమైన్, 700 ఎంఎల్ లిక్విడ్ మెథాం ఫెటమైన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు చక్రవర్తి తెలిపారు.

ఇది కూడా చదవండి: నకిలీ కరెన్సీ చలామణీకి యత్నం.. గుట్టు రట్టు చేసిన ఎన్‌ఐఏ

ఈ డ్రగ్స్ తయారు చేస్తున్న వారిలో కె.శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడని చెప్పారు. ప్రైవేటు ఉద్యోగం చేస్తూ గాజుల రామారంలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ గతంలో 2013లో ఓ పరిశ్రమలో డ్రగ్స్ తయారు చేయగా అప్పట్లో అరెస్ట్ అయి జైలుకు సైతం వెళ్లినట్లు తెలిపారు. జైలు నుంచి వచ్చాక నరసింహ రాజు, మణికంఠతో కలిసి డ్రగ్స్ తయారు చేయడం మొదలు పెట్టినట్లు తెలిపారు. ఈ ముగ్గురు కలిసి తయారు చేసిన డ్రగ్స్ ను వివిధ ప్రాంతాల్లో సోషల్ మీడియా ద్వారా విక్రయిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

ఇది కూడా చదవండి: దైవ దర్శనానికి వెళ్తుండగా విషాదం.. కుటుంబాన్ని కబళించిన మృత్యువు

వారిపై పీడీ యాక్ట్ నమోదుకు ప్రతిపాదన చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం చిన్నారుల నుంచి పెద్దల వరకు సోషల్ మీడియా విస్తృతంగా వినియోగిస్తున్న తరుణంలో మాదకద్రవ్యాలను సోషల్ మీడియా వేదికగా విక్రయాలు జరుపుతున్న ముఠాలు పెరిగిపోవడం ఆందోళన నగర వాసులను ఆందోళన కలిగిస్తోంది.

Advertisment
తాజా కథనాలు