/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/DRINKING-WATER-1.jpg)
నీరు లేకుండా జీవి మనుగడ లేదు. మానవ శరీరంలో 60 నుండి 70 శాతం నీరు ఉంటుంది. నీటి కొరత శరీరంలో అనేక వ్యాధులకు కారణమవుతుంది. అటువంటి పరిస్థితిలో, వేసవి కాలంలో శరీరానికి ఎక్కువ నీరు అవసరం. మిగిలిన సీజన్లలో కంటే వేసవిలో ఎక్కువ నీరు త్రాగడానికి కారణం ఇదే. కానీ నీరు త్రాగేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. దీని కారణంగా చాలా తీవ్రమైన వ్యాధులను ఎదుర్కొక తప్పుదు. మీరు కూడా హడావిడిగా నిలబడి నీళ్లు తాగుతున్నట్లయితే ఈ పొరపాటు అస్సలు చేయకండి. ఎందుకంటే దాని వల్ల వచ్చే ఇబ్బందులు చాలా తీవ్రంగా ఉంటాయి. నిలబడి నీళ్లు తాగడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొవల్సి వస్తుందో తెలుసుకుందాం.
కిడ్నీపై ప్రభావం:
కిడ్నీ సమస్యలతో బాధపడేవారు నిలబడి నీళ్లు తాగవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కూర్చొని నీళ్లు తాగితే కిడ్నీ బాగా ఫిల్టర్ అవుతుందని చాలా పరిశోధనల్లో వెల్లడైంది. నిలబడి నీళ్లు తాగితే మూత్రనాళానికి సంబంధించిన వ్యాధులు ఎదుర్కొవల్సి వస్తుంది.
ఊపిరితిత్తులపై ప్రభావం:
ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడేవారు నిలబడి నీళ్లు తాగకూడదు. మీరు నిలబడి నీటిని తాగితే, ఆ సమయంలో శరీరంలో ఆక్సిజన్ స్థాయిని మరింత దిగజార్చవచ్చు. ఇది ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది.
కీళ్ల సమస్య:
నిలబడి నీళ్లు తాగడం వల్ల కీళ్లపై చెడు ప్రభావం చూపుతుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. నిజానికి నిలబడి నీళ్ళు తాగితే, హడావుడిగా తాగుతాం. దీని కారణంగా కీళ్లను ప్రభావితం చేసే నరాలలో ఉద్రిక్తత ఉంటుంది. ఎక్కువ సేపు నిలబడి నీళ్లు తాగడం వల్ల కూడా కీళ్ల నొప్పులు రావచ్చు.
జీర్ణక్రియపై చెడు ప్రభావం:
నిలబడి నీరు త్రాగడం జీర్ణక్రియను మరింత దిగజార్చుతుంది, ఎందుకంటే ఈ విధంగా నీరు తాగితే..నీరు వేగంగా కడుపులోకి చేరుతుంది, ఇది జీర్ణక్రియకు హానికరం. అటువంటి పరిస్థితిలో, కడుపు నొప్పి జీర్ణ సమస్యలు సంభవించవచ్చు.