నీరు లేకుండా జీవి మనుగడ లేదు. మానవ శరీరంలో 60 నుండి 70 శాతం నీరు ఉంటుంది. నీటి కొరత శరీరంలో అనేక వ్యాధులకు కారణమవుతుంది. అటువంటి పరిస్థితిలో, వేసవి కాలంలో శరీరానికి ఎక్కువ నీరు అవసరం. మిగిలిన సీజన్లలో కంటే వేసవిలో ఎక్కువ నీరు త్రాగడానికి కారణం ఇదే. కానీ నీరు త్రాగేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. దీని కారణంగా చాలా తీవ్రమైన వ్యాధులను ఎదుర్కొక తప్పుదు. మీరు కూడా హడావిడిగా నిలబడి నీళ్లు తాగుతున్నట్లయితే ఈ పొరపాటు అస్సలు చేయకండి. ఎందుకంటే దాని వల్ల వచ్చే ఇబ్బందులు చాలా తీవ్రంగా ఉంటాయి. నిలబడి నీళ్లు తాగడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొవల్సి వస్తుందో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..నీళ్లు ఇలా తాగుతున్నారా?..మీ ఎముకలు విరుగుతయ్ జాగ్రత్త…!!
నిలబడి హడావుడిగా నీళ్లు తాగుతున్నారా? అయితే ఇక నుంచి అలా చేయకండి. ఎందుకంటే మంచినీళ్లు తాగేటప్పుడు కూర్చుని తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే శరీరంలో అన్ని భాగాలకు, కణాలకు, కండరాలకు నీరు సమానంగా అందుతుంది. మూత్రపిండాలు కూడా సమర్థవంతంగా పనిచేస్తాయని సూచిస్తున్నారు. నిలబడి నీళ్లు తాగినప్పుడు ఎక్కువ శాతం నీరు ఎముకల కీళ్లలోకి చేరుతాయట. ఇలా చేరడం వల్ల ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీళ్లు ఒకేసారి తాగకుండా..కొంచెం కొంచెం తాగడం మంచిదంటున్నారు.
Translate this News: