నిరుపేదల సొంతింటి కల నేరవేర్చాలని కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథాకాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ పథకాన్ని అడ్డంగా పెట్టకుని చాలా మంది మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని నిరుపేదలను మోసం ఘటన హైదరాబాద్ రహమత్ నగర్లో వెలుగు చూసింది. బాధితులు మీడియా ముందుకు రావడంతో ఈ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తానని లక్షల్లో వసూలు చేసిన స్థానిక నాయకుడి వివరాలను మీడియాకు చెప్పారు బాధితులు. అతనిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు మీడియా ద్వారా తెలియజేశారు. ఇక ఇల్లు లేని వాళ్ళకి డబుల్ బెడ్రూంలు ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఉపేందర్ రెడ్డి దగ్గర తమ బాధను చెప్పుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ వినతి పత్రం అందించారు.
పూర్తిగా చదవండి..Cheating: డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో ఆగని మోసాలు
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన డబుల్ బెడ్ రూమ్ పథకంలో దళారులు, కేటుగాళ్లు చేరి సామాన్యులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని నిరుపేదలను మోసం ఘటన హైదరాబాద్ రహమత్ నగర్లో వెలుగు చూసింది. డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తానని లక్షల్లో వసూలు చేసిన స్థానిక నాయకుడిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది.
Translate this News: