సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. కేసీఆర్ ఫాంహౌజ్ లో కూర్చొని నీరోచక్రవర్తిలాగా వ్యవహరించవద్దని ఆయన ఫైర్ అయ్యారు. సమీక్ష చేస్తున్నామని మభ్యపెట్టొద్దని.. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు. ఇక ఉత్తర తెలంగాణాకు ప్రాణ ప్రదాయిని అయిన గోదావరి సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే దుఃఖదాయినిగా మిగిలిందన్నారు.
పూర్తిగా చదవండి..కేసీఆర్.. ఫాంహౌస్లో కూర్చొని నీరోచక్రవర్తిలాగా వ్యవహరించొద్దు..!
సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. కేసీఆర్ ఫాంహౌజ్ లో కూర్చొని నీరోచక్రవర్తిలాగా వ్యవహరించవద్దని ఆయన ఫైర్ అయ్యారు. సమీక్ష చేస్తున్నామని మభ్యపెట్టొద్దని.. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతంలో బాధితులు కట్టు బట్టలతో మిగిలిపోయారన్నారు. ఇళ్లలో సామాను కొట్టుకుపోయిన వారికి ఒక్కో ఇంటికి 25 వేల రూపాయలు ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలని.. వెంటనే సర్వే చేయించాలని ఈటల డిమాండ్ చేశారు.
Translate this News: