వేసవికాలం ముగిసింది. వర్షాకాలం వచ్చేసింది. ఇప్పుడిప్పుడే వానలు జోరందుకుంటున్నాయి. వాతావరణం కూడా చల్లగా మారింది. అందుకే ఈ కాలంలో జీవనశైలిలో మార్పులు చేసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ఈ కాలంలో జబ్బులు ఎక్కువగా వేధిస్తుంటాయి. దోమల వల్ల అనేక రకాల రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఈ కాలంలో డెంగ్యూ అటాక్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.
పూర్తిగా చదవండి..వర్షాకాలంలో ఈ పండు తింటే డెంగ్యూకి చెక్ పెట్టొచ్చు..!!
వర్షాకాలం...ఈ కాలంలో ఎన్నో రోగాలు పలుకరిస్తుంటాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం, డెంగ్యూ, వైరల్ ఫీవర్లు..ఇవన్నీ కూడా ఈ కాలంలోనే వస్తుంటాయి. అయితే వీటి బారి నుంచి బయటపడాలంటే మనకు తగినంత ఇమ్యూనిటీ తప్పనిసరి. అందుకే సీజనల్ గా దొరికే పండ్లు తినాలని చెబుతుంటారు వైద్యనిపుణులు. ముఖ్యంగా వర్షాకాలం రాగానే దోమల వల్ల వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు సంక్రమిస్తుంటాయి. నిజానికి డెంగ్యూ సోకితే శరీరంలో ప్లేట్ లెట్స్ తగ్గుతాయి. దీంతో శరీరం బలహీనంగా మారుతుంది. కీళ్లనొప్పులు విపరీతంగా వేధిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారుతుంది. ఈ వ్యాధిబారిన పడినవారు నెమ్మదిగా కోలుకుంటారు. అయితే డెంగ్యూ సోకినవారికి కివి అద్బుతంగా పనిచేస్తుంది. ప్లేట్ లెట్స్ ను పెంచడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. అందుకే వర్షాకాలం వచ్చిందంటే కివీ పండుకు డిమాండ్ భారీగా పెరుగుతుంది.
Translate this News: