ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ నెల 8న హనుమకొండలో జరిగే భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా రానున్నారు. దీంతో ఈ సభలో మోడీ ఏం మాట్లాడతారన్న విషయంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే చాలా మంది బీజేపీ శ్రేణులు మోడీ రాకకోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న లక్ష్యంతోనే ఈమధ్య కాలంలో వరుస పర్యటనలపై మోడీ ఫోకస్ పెట్టారు. ఇప్పుడు తాజాగా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ను మార్చుతున్నట్లు వార్తలు ఈ మధ్యకాలంలో జోరుగా వినిపిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని హోదాపై బండి సంజయ్ రియాక్షన్ ఇదే..!!
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ జోరు కనిపిస్తుంటే..బీజేపీ మాత్రం అంతర్గత విభేదాలతో సతమతమవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీపై అధిష్టానం కన్నేసింది. రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహించింది. టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను తప్పిస్తారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 8న హనుమకొండలో బీజేపీ భారీ బహిరంగసభను తలపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సభకు ప్రధాని నరేంద్రమోడీ హాజరవ్వనున్నారు. ఈ సభలో మోడీ ఏం మాట్లాడనున్నారు..అనే విషయంపై రాజకీయా వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

Translate this News: