/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/BANDI-SANJAY-1.jpg)
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ నెల 8న హనుమకొండలో జరిగే భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా రానున్నారు. దీంతో ఈ సభలో మోడీ ఏం మాట్లాడతారన్న విషయంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే చాలా మంది బీజేపీ శ్రేణులు మోడీ రాకకోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న లక్ష్యంతోనే ఈమధ్య కాలంలో వరుస పర్యటనలపై మోడీ ఫోకస్ పెట్టారు. ఇప్పుడు తాజాగా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ను మార్చుతున్నట్లు వార్తలు ఈ మధ్యకాలంలో జోరుగా వినిపిస్తున్నాయి.
అయితే హనుమకొండలో జరిగే సభకు జనసమీకరణపై ఆదివారం సాయంత్రం బీజేపీ నేతలు సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే పార్టీ కార్యకర్తలు..రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తున్నారన్న వార్త గుప్పుమంటున్నాయి ఇది నిజమేనా అంటూ బండి సంజయ్ ను అడిగారు. పార్టీ కార్యకర్తలు అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ సమాధానం ఇచ్చారు. మోడీ బహిరంగ సభకు రాష్ట్ర అధ్యక్షుని హోదాలో వస్తానో లేదో తెలియదు. బండి వల్లే తెలంగాణలో బీజేపీ గ్రామస్థాయి వరకు విస్తరించిందని కార్యకర్తలు అంటున్నారు. కేవలం బండి సంజయ్ పోరాటం వల్ల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల అరాచకాలను ఎదుర్కొంటున్నామని స్పష్టం చేశారు.
బండి సంజయ్ స్టేట్ చీఫ్ గా కొనసాగాలంటూ పలువురు కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకున్నారు. మీ కష్టాన్ని వ్రుథా కానివ్వనని బండి సంజయ్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఏదిఏమైనప్పటికీ పార్టీ నిర్ణయమే తుది నిర్ణయం అవుతుందని...ప్రధాని మోడీ సభకు అందరూ హాజరై సభను విజయవంతం చేయాలని బండి కార్యకర్తలకు సూచించారు.