సమ్మర్ లో కూలింగ్ వాటర్ తాగుతున్నారా?అయితే ఇంక అంతే!

ఎండలు మండుతుంటే చాలా మంది చల్లని నీటిని తాగేందుకు ఇష్టపడతారు. కానీ, చల్లని నీరు ఎక్కువగా తాగితే ఈ సమస్యలు తప్పవు..అవేంటో ఇప్పుడు చూద్దాం!

New Update
సమ్మర్ లో కూలింగ్ వాటర్ తాగుతున్నారా?అయితే ఇంక అంతే!

మండే ఎండల్లో ఫుడ్ కంటే ఎక్కువగా నీరే కడుపులోకి పోతుంది. చాలా మంది ఫ్రిజ్ నీరు, చల్లని నీటిని తాగుతుంటారు. దీని వల్ల అప్పటికప్పుడు చల్లగానే అనిపిస్తుంది. కానీ తర్వాత ఆరోగ్య సమస్యలొస్తాయి. అవేంటో తెలుసుకోండి.

చల్లని నీరు తాగితే కడుపులోని ఆహారం త్వరగా జీర్ణమవ్వదు. ఇది జీర్ణక్రియని ఎఫెక్ట్ చేస్తుంది. దీంతో సరిగ్గా జీర్ణమవ్వక కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు వస్తాయి.​ఎక్కవగా చల్లని నీరు తాగితే బ్రెయిన్‌పై ఎఫెక్ట్ పడుతుంది. దీంతో తలనొప్పి, సైనస్ వంటి సమస్యలొస్తాయి. ఇలాంటి సమస్యని రావొద్దొంటే చల్లని నీటిని తగ్గించండి. దీని వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.ఎండాకాలంలో చల్లని నీరు తాగడం వల్ల గొంతు నొప్పి వస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. చల్లని నీటితో ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోయి గొంతు, ముక్కులో రద్దీ ఏర్పడుతుంది.
చల్లని నీరు తాగితే హార్ట్ బీట్ తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. బాడీలోని ముఖ్య భాగం, నాడీ వ్యవస్థ ఎఫెక్ట్ అవుతుంది. దీంతో గుండె వేగం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.చల్లని నీరు తాగితే దంతాల్లోని నరాలు దెబ్బతిని దంతాల సున్నితత్వం ఏర్పడుతుంది. ఉష్ణోగ్రతలో మార్పుల వల్ల అసౌకర్యం, నొప్పి ఉంటుంది. ఇలాంటప్పుడు చల్లని నీటిని తగ్గించడం, డాక్టర్‌ని కలవడం మంచిది.
Advertisment
తాజా కథనాలు