Venkateswara Swamy: వెంకటేశ్వరస్వామి అనుగ్రహం కోసం బియ్యంతో ఇలా చేయండి

కలియుగదైవం వెంకటేశ్వరస్వామికి ప్రతి శనివారం చిన్న పరిహారం చేస్తే స్వామివారి కృపతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుంది. స్వామికి తులసి మాల అంటే ఎంతో ఇష్టం. స్వామివారి అనుగ్రహం ఏం చేస్తే తొందరగా లభిస్తుందో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Venkateswara Swamy: వెంకటేశ్వరస్వామి అనుగ్రహం కోసం బియ్యంతో ఇలా చేయండి

Venkateswara Swamy: లియుగదైవం వెంకటేశ్వరస్వామికి కోరిన కోర్కెలు తీర్చే ఆపద మొక్కులవాడు అనే పేరు ఉంది. స్వామి అనుగ్రహం పొందాలంటే అంత సాధారణ విషయం కాదు. శని ప్రభావం పోవాలన్నా వెంకటేశ్వరుడికి నిత్యం పూజలు చేస్తుండాలి. ఆయన కరుణతో ఎలాంటి దోషాలు ఉండవని పండితులు చెబుతున్నారు.

publive-image

ప్రతి శనివారం చిన్న పరిహారం చేస్తే స్వామివారి కృపతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఉదయం లేవగానే ఇంటితో పాటు పూజ గదిని కూడా శుభ్రం చేయాలి. వెంక‌టేశ్వరుడి ఫొటో ఎడమ పక్కన లక్ష్మీదేవి ఫొటోను ఉంచాలి. స్వామివారి గుండెల్లో ల‌క్ష్మీ కొలువై ఉంది. బియ్యం పిండి, చిన్న బెల్లం ముక్క, పాలు, అర‌టి పండుతో చపాతీలా చేసుకుని దాన్ని దీపపు ప్రమిదలా తయారు చేసుకోవాలి.ఇందులో ఏడు ఒత్తులు వేసి వెలిగించాలి. అలాగే స్వామికి తులసి మాల అంటే ఎంతో ఇష్టం, తులసి మాల వేస్తే అనుగ్రహం తొందరగా లభిస్తుంది.

publive-image

శని ప్రభావం ఒక్కటే కాకుండా ఇంకా సమస్యలు ఉంటే కచ్చితంగా 8 శనివారాల పాటు పూజ చేయాలి. మధ్యలో అడ్డంకులు వస్తే మళ్లీ ఆపిన దగ్గరి నుంచి మొదలుపెట్టాలి.అంతేకాకుండా.. వెంకటేశ్వరస్వామికి ప్రీతిపాత్రమైన నామాలను ఎప్పుడూ తలుచుఉంటూ ఉండాలి. గుడికి వెళ్లినా ముందు నామాన్ని చూస్తే ఫ‌లితం అని పండితులు చెబుతున్నారు. ఇలా ఆయన్ని కొలిస్తే ఎప్పుడూ ఆయన కరుణ మనపై ఉంటుందని పెద్దలు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: పాదరక్షలకు కూడా జోతిష్యం వర్తిస్తుందా?..ఈ పనులు అస్సలు చేయకండి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
తాజా కథనాలు