నేటికాలంలో చాలామంది అధికబరువు సమస్యతో బాధపడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. కారణం జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు. వీటితోపాటు ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. అయితే చాలా మంది లంచ్, సాయంత్రం డిన్నర్ మధ్య అనేక తప్పులు చేస్తుంటారు. దాని ఫలితంగా ఆరోగ్యం పాడుచేసుకుంటారు. సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య సమయంలో ఆకలిగా అనిపించినా…భోజనం తినాలనిపించదు. అలాంటి పరిస్థితిలో చాలా మంది జంక్ ఫుడ్, పిజ్జాలు, బర్గార్లు, నూనెలో వేయించిన ఫుడ్స్ తింటుంటారు. వీటి వల్ల బరువు పెరగడమే కాదు..అనేక రోగాలు కూడా చుట్టుముడుతాయి.
సాయంత్రం పూట వీటికి దూరంగా ఉండండి:
– సాయంత్రం వేళల్లో నూనెలో వేయించిన ఆహారాన్ని తినడం మానుకోండి. మీరు సాయంత్రం సమోసాలు, చాట్లను తినడానికి ఇష్టపడితే అది చాలా ప్రమాదం. ఎందుకంటే ఇవి తిన్నతర్వాత మీ బరువు వేగంగా పెరుగడంతోపాటు… కొలెస్ట్రాల్ స్థాయి కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
-జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ కూడా సాయంత్రం తినకూడదు. మీరు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినాలనుకుంటే, వెంటనే దానిని ఆపండి. ప్రాసెస్ చేసిన ఆహారం జీర్ణ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది.
-సాయంత్రం పూట మద్యం సేవించడం మానుకోవాలి. ఆల్కహాల్ తీసుకోవడం శరీరంలోని అంతర్గత అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
– సాయంత్రం పూట చీజ్ తినకూడదు. ఇందులో సోడియం, సంతృప్త కొవ్వు అధికంగా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంతోపాటు అధిక రక్తపోటును కలిగిస్తుంది.
-మీరు స్వీట్లను ఇష్టపడితే, సాయంత్రం స్వీట్లు తినడం మానేయండి. ఐస్ క్రీం, స్వీట్లు వంటి వాటిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది, ఇది అనేక వ్యాధులకు కారణమవుతుంది. అటువంటి పరిస్థితిలో, ఆరోగ్యంగా ఉండటానికి, మీరు తీపి వస్తువులకు దూరంగా ఉండాలి.