నిర్లక్ష్యమే మా కుటుంబానికి తీరని దుఃఖం మిగిల్చింది: డైరెక్టర్ వెంకీ

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల సోషల్ మీడియా వేదికగా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టారు. అంతేకాదు ఈ పోస్ట్ లో ఆరోగ్యానికి సంబంధించి అభిమానులతోపాటు నెటిజన్లకు కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. చిన్న చిన్న తప్పులు, నిర్లక్ష్యంతో ప్రాణాలు పోగొట్టుకోవద్దని హెచ్చరించారు.

New Update
నిర్లక్ష్యమే మా కుటుంబానికి తీరని దుఃఖం మిగిల్చింది: డైరెక్టర్ వెంకీ

Venky Kudumula: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల సోషల్ మీడియా వేదికగా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టారు. అంతేకాదు ఈ పోస్ట్ లో ఆరోగ్యానికి సంబంధించి అభిమానులతో పాటు నెటిజన్లకు కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. చిన్న చిన్న తప్పులు, నిర్లక్ష్యంతో ప్రాణాలు పోగొట్టుకోవద్దని హెచ్చరించారు.


ఈ మేరకు వెంకీ కుడుముల షేర్ చేసిన పోస్ట్ పరిశీలిస్తే.. 'కొన్ని వారాలుగా మా కజిన్‌ జ్వరంతో బాధపడుతున్నారు. అది మాములు జ్వరమే అనుకుని, డాక్టర్ వద్దకు వెళ్లలేదు. అది కాస్తా అరుదైన జీబీ సిండ్రోమ్‌కు దారి తీసింది. సరైన సమయంలో చికిత్స తీసుకుని ఉంటే ఇలా జరిగేది కాదు. ఆలస్యం చేయడం వల్లే తన జీవితాన్ని కోల్పోవాల్సి వచ్చింది' అని రాసుకొచ్చాడు.

Also Read: భగవంత్‌ కేసరి సినిమా పై నటి సంచలన కామెంట్లు!

అలాగే ఈ నిర్లక్ష్యం తమ కుటుంబానికి తీరని దుఃఖం మిగిల్చిందని, కోవిడ్ తర్వాత జ్వరాన్ని కూడా తేలికగా తీసుకుంటున్న జనాలు ఇకనైనా సీరయస్ గా తీసుకోవాలన్నారు. 'దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు. చిన్న జ్వరం వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇలాంటి జాగ్రత్తలే మన ప్రాణాలు కాపాడతాయి' అని రిక్వెస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుండగా చాలామంది తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. కొంతమంది మంచి సమాచారం ఇచ్చినందుకు థాంక్స్ చెబుతున్నారు.

#shocking-post #viral #director-venky-kudumula
Advertisment
తాజా కథనాలు