Kurnool: ఎన్డీఏ కూటమిలో విభేదాలు.. బాలకృష్ణ సభకు దూరంగా జనసేన, బీజేపీ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎన్డీఏ కూటమిలో విభేదాలు బయటపడ్డాయి. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డి బీజేపీ, జనసేన పార్టీల నియోజవర్గ ఇంచార్జీలను పట్టించుకోనట్లు తెలుస్తోంది. దీంతో రేపు బాలకృష్ణ సభకు వీరు దూరంగా ఉండనున్నట్లు సమాచారం. By Jyoshna Sappogula 15 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Kurnool: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎన్డీఏ కూటమిలో విభేదాలు బయటపడ్డాయి. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయ నాగేశ్వర రెడ్డి బీజేపీ, జనసేన పార్టీల నియోజవర్గ ఇంచార్జీలను పట్టించుకోనట్లు తెలుస్తోంది. దీంతో రేపు ఎమ్మిగనూరులో జరిగే బాలకృష్ణ సభకు బీజేపీ జనసేన దూరంగా ఉండనున్నట్లు సమాచారం. Also Read: ప్రతిపక్షాలన్నీ ఒకే లైన్ లో ఉన్నాయి.. రాయితో ఎవరైనా కొట్టించుకుంటారా? బాలయ్య రోడ్ షో కు వెల్లకూడదని ఇరుపార్టీల నియోజకవర్గ ఇంచార్జిలు కార్యకర్తలతో సమావేశం నిర్వహించినట్లు టాక్ వినిపిస్తోంది. పొత్తు ధర్మం పాటించడం లేదని బీజేపీ ఇంచార్జీ మురహరీ రెడ్డి బాహాటంగానే విమర్శించారు. గత 10 రోజుల క్రితం జరిగిన ప్రజాగళం కార్యక్రమానికి కూడా పిలవలేదని గ్లాస్, కమలం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. #kurnool మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి