AP News: ఏపీలో వాట్సాప్ స్టేటస్, షేరింగ్స్ నిషిద్ధం.. డీజీపీ హరీష్ గుప్తా సంచలన ప్రకటన!

ఏపీ ఎన్నికల ఫలితాల వేళ సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలుంటాయని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. ఫొటో, వీడియోలను వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోవడం, షేర్ చేయడం నిషిద్ధం అన్నారు. నిరంతరం పోలుసుల నిఘా ఉంటుందని తెలిపారు.

New Update
AP News: ఏపీలో వాట్సాప్ స్టేటస్, షేరింగ్స్ నిషిద్ధం.. డీజీపీ హరీష్ గుప్తా సంచలన ప్రకటన!

Amaravathi: ఏపీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలుంటాయని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతూ సమాజంలో అశాంతి సృష్టిస్తున్నారన్నారు. మరి కొందరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారని, అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: RTV Post Poll Study: ఏపీలో మారిన లెక్కలు.. గెలిచేది వారే.. రవిప్రకాష్ సంచలన పోస్ట్ పోల్ స్టడీ!

అసాంఘిక కార్యకలపాలకు పాల్పడే వారిపై IT act కింద కేసులు నమోదు చేయడంతో పాటు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామన్నారు. అలాగే PD ACT ప్రయోగించడం వంటి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డి‌జి‌పి హరీష్ కుమార్ గుప్తా ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. అట్టి పోస్టులు ఎవరి ప్రోద్భలంతో పెడుతున్నారో కూడా విచారణ చేస్తామని, వారిని కూడా ఉపేక్షించబోమని హెచ్చరించారు. పలు పోస్టులు, ఫొటోలు, వీడియోలను వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోవడం లేదా షేర్ చేయడం కూడా నిషిద్ధం అని తెలిపారు. గ్రూప్ అడ్మిన్ లు కూడా అటువంటి వాటిని ప్రోత్సహించకూడదని తెలియచేసారు. ఈ విషయాన్ని అందరు గమనించగలరు. సోషల్ మీడియా పోస్టులపై పోలీస్ శాఖ నిరంతర నిఘా ఉంటుందనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు.

Advertisment
తాజా కథనాలు