ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలోని అధికారుల బదిలీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ కు బిల్లు మంగళవారం ( ఆగస్టు 1) లోకసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుకు మోదీ కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తోంది. తాడోపేడో తేల్చుకునేందుకు అటు విపక్షాలు కూడా అస్త్రాలతో సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు-2023’ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆగస్టు 1న లోక్సభలో చేపట్టనున్న వ్యవహారాల జాబితాలో ఈ బిల్లును చేర్చారు. అయితే ముందుగా ఈ బిల్లును సోమవారం జూలై 31న సమర్పించాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం దానిని సమర్పించలేదు.
పూర్తిగా చదవండి..నేడు పార్లమెంట్ ముందుకు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు…!!
ఢిల్లీలో సర్వీసుల నియంత్రణపై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్పై పార్టీ వైఖరికి మద్దతు ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీలందరికీ విప్ జారీ చేసింది. జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు ఎంపీలందరూ సభకు హాజరు కావాలని, పార్టీ పంథాలో నడుచుకోవాలని విప్లో పేర్కొన్నారు.
Translate this News: