/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Manish-Sisodia.jpg)
Manish Sisodia: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. లిక్కర్ స్కాం ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలంటూ సిసోడియా దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. అధికారాన్ని దుర్వినియోగం చేశారని, ప్రజా విశ్వాసాన్ని భంగపరిచారని పేర్కొంది.
Delhi High Court denies bail to former Deputy Chief Minister and AAP leader Manish Sisodia in both ED and CBI cases related to the alleged liquor policy scam. #ManishSisodia #ED #CBI pic.twitter.com/cft74CzPku
— Live Law (@LiveLawIndia) May 21, 2024
మే 31 వరకు కస్టడీ..
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత, దేశ రాజధాని మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia) జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు మే 31 వరకు పొడిగించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీష్ సిసోడియా ఫిబ్రవరి 2023 నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
ఇప్పుడు రద్దు చేయబడిన మద్యం పాలసీ (Liquor Policy) కి సంబంధించి మనీలాండరింగ్ విచారణకు సంబంధించి అతని బాస్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కూడా అరెస్టయ్యారు. ప్రస్తుతం ఆయన జూన్ 2 వరకు మధ్యంతర బెయిల్పై ఉన్నారు.