యమునా నది నీటిమట్టం ప్రమాదకరస్థాయికి మించి ప్రవహిస్తుండటంతో ఢిల్లీలోని పలు ప్రాంతాలు జలయమయ్యాయి. ఇప్పటికే ఐటీఓ, ఎర్రకోట, ఢిల్లీ సచివాలయంతోపాటు చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రాజధాని వాసుల జీవనం అస్థవ్యస్థంగా మారడంతో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈక్రమంలో ఢిల్లీలో రాజకీయాలు హీటెక్కాయి. ఈ విపత్తుకు ఆమ్ ఆద్మీ ప్రభుత్వమే కారణమంటూ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఆరోపించారు. ఢిల్లీ సర్కార్ విపత్తు నిర్వహణలో లోపం ఉందని ఆరోపించారు. ఢిల్లీ వాసులారా ఇప్పటికైనా మేల్కోండి. ఏది ఉచితం కాదు..ఉచితాలకోసం పోతే ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొవల్సి వస్తుందని ట్వీట్ చేశారు. దేశ రాజధానిలో ప్రజల ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..ఢిల్లీ వాసులారా ఇప్పటికైనా మేల్కోండి..ఉచితాల కోసం పోతే…సీఎంకు బీజేపీ చురకలు..!!
ఢిల్లీని వరదలు ముంచెత్తాయి. యుమునా నది ఉప్పొంగి ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్భందంలో చిక్కుకుపోయాయి. సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ గౌతమ్ గంబీర్ కేజ్రివాల్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. భారీవర్షాలతో ఢిల్లీ అతలాకుతలం అవుతుంటే...ఉచితంగా సౌకర్యాలు కల్పించాలన్న ప్రభుత్వ పథకాలపై మండిపడ్డారు. ప్రజల బాధలను పట్టించుకుని ప్రభుత్వం...వారితో రాజకీయాలు చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఢిల్లీ ప్రజలు ఇప్పటికైనా మేల్కోండి. ఈ ప్రభుత్వం ఇచ్చే ఉచితాలగురించి ఆలోచిస్తే ఇలాంటి సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుందన్నారు.
Translate this News: