అంగన్వాడీ వర్కర్లను శిక్షణ కోసం విదేశీ విద్యాసంస్థలకు పంపిస్తామని, తద్వారా పిల్లల సర్వతోముఖాభివృద్ధిలో వారు ముఖ్యపాత్ర పోషిస్తారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అన్నారు. గురువారం త్యాగరాజ్ స్టేడియంలో అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారుల కోసం కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) రూపొందించిన ఎడ్యుకేషనల్ కిట్ (ఖేల్ పితర)ను ముఖ్యమంత్రి, మహిళా శిశు అభివృద్ధి, విద్యాశాఖ మంత్రి అతిషి (Atishi)ఆవిష్కరించారు. కార్యక్రమంలో కిట్లో పొందుపరిచిన పరికరాల వినియోగం గురించి సమాచారం అందించారు.
పూర్తిగా చదవండి..Arvind Kejriwal: అంగన్వాడీ కార్యకర్తలను శిక్షణ కోసం విదేశాలకు పంపుతాం..!!
ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ (Arvind Kejriwal) సంచలన ప్రకటన చేశారు. అంగన్ వాడీ కార్యకర్తలను శిక్షణ కోసం విదేశాలకు పంపుతామంటూ పేర్కొన్నారు. గురువారం ఢిల్లీ స్టేడియంలోని ఆడిటోరియంలో వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తల సమక్షంలో అంగన్వాడీ పిల్లల సర్వతోముఖాభివృద్ధికి రూపొందించిన ఎడ్యుకేషనల్ కిట్ను ముఖ్యమంత్రి కేజ్రివాల్, విద్యాశాఖ మంత్రి అతిషి ఆవిష్కరించారు. అంగన్వాడీ కార్యకర్తలను శిక్షణ కోసం విదేశీ విద్యాసంస్థలకు పంపిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అంతే కాకుండా పిల్లల అభివృద్ధికి సంబంధించిన పనుల్లో తప్ప మరే పనిలో పాలుపంచుకోకూడదన్నారు.
Translate this News: