కొద్ది రోజులకు ముందు (బీసీసీఐ) భారత క్రికెట్ బోర్డు కోచ్ పదవికి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నెల 27 వరకు దరఖాస్తులను చేసుకోవాలని బీసీసీఐ సూచించింది.అయితే వేల సంఖ్యలో హెడ్ కోచ్ పదవికీ దరఖాస్తులు వచ్చి చేరాయి. జరిగిన ఐపీఎల్ సిరీస్లో కోల్కతా నైట్ రైడర్స్ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆరంభం నుంచి పటిష్టంగా ఉన్న కోల్కతా చివరి వరకు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో రాణించడంతో ఆ జట్టు ట్రోఫీని సాధించింది.
కోల్కతా జట్టు అన్ని రంగాల్లో రాణించడానికి ఆ జట్టు కన్సల్టెంట్గా ఉన్న గౌతమ్ గంభీర్ కారణమని కోల్కతా జట్టు ఆటగాళ్లు, నిర్వాహకులు పదే పదే చెబుతున్నారు.ఈ సందర్భంలో, భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ను నియమించడంపై బీసీసీఐ కమిటీలో చాలా మంది గంభీర్ కు మద్దతు తెలిపారు. మాజీ లు, ప్రస్తుత ఆటగాళ్లు కూడా అతని పేరును సూచించినట్లు సమాచారం. దీంతో తదుపరి కోచ్ గా గంభీర్ అవుతాడని దాదాపు ఖారారైనట్టు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే భారత క్రికెట్ బోర్డు ప్రకటన చేయనుందని సమాచారం.