రైతులకు ఉచిత కరెంట్పై టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఓవైపు సొంతపార్టీ నేతలు.. మరోవైపు అధికార బీఆర్ఎస్ పార్టీ లీడర్లు రేవంత్పై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. రేవంత్ వ్యాఖ్యలపై మాజీ కాంగ్రెస్ లీడర్, ప్రస్తుత బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విరుచుకుపడ్డారు. అసలు రేవంత్కి ఏం తెలుసంటూ విమర్శలు గుప్పించారు. రైతులకు 3గంటలు లేదా 8గంటలు ఉచిత కరెంట్ సరిపోతుందని రేవంత్రెడ్డికి ఎలా తెలుసని..ఓసారి ఆయన పుట్టి, పెరిగిన చోట కానీ..ఇతర గ్రామాల్లో కానీ రైతులను అడిగి చూడలన్నారు శ్రవణ్. రాజశేఖర్రెడ్డి, కిరణ్కుమార్రెడ్డికి చేసింది తప్పా..? ఉచిత్ కరెంట్ ఇచ్చిన కాంగ్రెస్ సీఎంలు వాళ్లే కదా అంటూ గతాన్ని గుర్తు చేశారు శ్రవణ్. రేవంత్ ఒక స్టుపిడ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు శ్రవణ్.
పూర్తిగా చదవండి..Sravan vs Revanth: రేవంత్రెడ్డి పచ్చ కామెర్లోడు..కనకపు సింహాసనంపై శునకం..దాసోజు శ్రవణ్ ఫైర్!
ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై మండిపడ్డారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. రైతులకు కరెంట్ వద్దు కానీ.. రేవంత్రెడ్డికి మాత్రం 24గంటలు కరెంట్ కావాలా అని ప్రశ్నిచారు. పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని..కనకపు సింహాసనంపై శునకం అంటే ఇదేనంటూ ఫైర్ అయ్యారు.
Translate this News: