YCP Sivaprasad: గడపగడపకి బూచేపల్లి కార్యక్రమం..!

ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీ పరిధిలో గడపగడకి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు వైసీపీ ఇంచార్జీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తనని గెలిపిస్తారనే నమ్మకం కలిగించారన్నారు.

New Update
YCP Sivaprasad: గడపగడపకి బూచేపల్లి కార్యక్రమం..!

Buchepally Sivaprasad Reddy: ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీ పరిధిలో గడపగడకి బూచేపల్లి కార్యక్రమంలో పాల్గొన్నారు దర్శి YSRCP ఇంచార్జీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. నియోజకవర్గ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి ప్రతి గడపగడపకు తిరిగి వారి సమస్యలు అడిగి తెలుసుకొంటున్నారు. పలుచోట్ల దీర్ఘ కాలికంగా పరిష్కారం కానీ సమస్యలు, కరెంటు తీగల ఇబ్బందులు వంటి సమస్యలను ప్రజలు వారికి తెలియజేశారు. అదే విధంగా కొన్ని పథకాలు అందరికీ రావట్లేదంటూ వాపోయారు.

Also Read: టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు..ఇన్ని ఇవాల్సిందే అంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్..!

దీనిపై స్పందించిన బూచేపల్లి సమస్యలు పరిష్కరించాలని సంభందిత అధికారులను కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రతి గడపలో తనను ఆప్యాయం పలకరించే ఆప్తులు ఉన్నారని.. రానున్న 2024 ఎన్నికల్లో బుచేపల్లి కుటుంబానికి తప్పక ఓటేసి గెలిపిస్తామని ప్రజలు ధైర్యం చెబుతున్నారన్నారు. వారి ఆదరాభిమానాలు చూస్తుంటే గెలిచిన ఆనందం కలుగుతుందన్నారు. ఈ సారి ఎన్నికల్లోనూ సీఎం జగన్ 175కి 175 సాధించి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

Also Read: విశాఖలో దారుణం.. పెళ్లి చేసుకోమన్న ప్రియురాలిని ప్రియుడు ఏం చేశాడంటే ?

Advertisment
Advertisment
తాజా కథనాలు