మొన్నటికిమొన్న మధ్యప్రదేశ్లో ఓ గిరిజనుడి ముఖంపై ప్రవేశ్శుక్లా అనే వ్యక్తి మూత్రం పోసిన ఘటన మరవకముందే ఉత్తరప్రదేశ్లో మరో అమానవీయ ఘటన వెలుగుచూసింది. కరెంటు పనులు చేసే ఓ దళితుడిపై దాడి చేయడమే కాకుండా.. తన చెప్పులను బలవంతంగా నాకించాడు ఓ దుర్మార్గుడు. నిందితుడిని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఎంప్లాయ్గా పనిచేస్తున్న తేజ్బలిసింగ్ పటేల్గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి.
పూర్తిగా చదవండి..Assaulted: చెప్పులపై ఉమ్మి వేసి బలవంతంగా నాకించాడు..దళితుడిపై అమానుషం..!
ఉత్తరప్రదేశ్లోని సోన్ భద్ర జిల్లాలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. ప్రైవేట్గా కరెంట్ పనులు చేసుకునే రాజేంద్ర అనే దళితుడిపై ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న పటేల్ దాడి చేశాడు. చెప్పులను నాకిస్తూ.. చంపలపై కొడుతూ హింసించాడు.
Translate this News: