Miss World 2024 Winner : మిస్ వరల్డ్ 2024-చెక్ రిపబ్లిక్‌ భామ క్రిస్టినా..రన్నరప్ ఎవరంటే?

మిస్ వరల్డ్ 2024 పోటీలు ఫైనల్ ముంబై వేదికగా అట్టహాసంగా జరిగాయి. మిస్ వరల్డ్ 2024 కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టినా పిస్కోవా అందుకున్నారు. రన్నరప్ గా లెబనాన్ కు చెందిన అజైటౌన్ నిలిచారు.

Miss World 2024 Winner : మిస్ వరల్డ్ 2024-చెక్ రిపబ్లిక్‌ భామ క్రిస్టినా..రన్నరప్ ఎవరంటే?
New Update

Miss World 2024 Winner :  27 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత భారత్ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చింది. ఈ కార్యక్రమంలో మిస్ వరల్డ్ 2024 విజేతను ప్రకటించారు. ఎన్నో అంచనాల మధ్య పోటీలో నిలిచిన భారత్ కు ఈసారి నిరాశే ఎదురైంది. భారత్ తరపున  కన్నడ భామ సినీ శెట్టి ప్రాతినిధ్యం వహించారు. ఆమె టాప్ 8కే పరిమితమయ్యారు. ఈ ఏడాది ఈ కిరీటాన్ని చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవా కైవసం చేసుకుంది . మాజీ ప్రపంచ సుందరి మేగాన్ యంగ్ కొత్త ప్రపంచ సుందరి కిరీటం ద్వారా ఏళ్ల నాటి సంప్రదాయాన్ని అనుసరించారు.

ఈ పోటీలో, లెబనాన్‌కు చెందిన యాస్మినా జైటౌన్ 71వ మిస్ వరల్డ్‌లో మొదటి రన్నరప్‌గా నిలిచింది. ఈ పోటీలో టాప్ 4 ఫైనలిస్ట్‌లలో లెబనాన్, ట్రినిడాడ్, టొబాగో, బోట్స్వానా , చెక్ రిపబ్లిక్ ఉన్నాయి.భారత పోటీదారు సిని శెట్టి టాప్ 8 వరకు ప్రతి రౌండ్‌ను సులభంగా పాస్ చేస్తూనే ఉంది.

కానీ ఆతిథ్య దేశానికి చెందిన పోటీదారులు టాప్ 4 రేసులో ఎలిమినేట్ అయ్యారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన నీతా అంబానీ, మిస్ వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డును అందుకున్నారు. 71వ మిస్ వరల్డ్ పోటీని మాజీ ప్రపంచ సుందరి మేగాన్ యంగ్, కరణ్ జోహార్ నిర్వహించారు. షాన్, నేహా కక్కర్ టోనీ కక్కర్ వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:  కాశీలో హర్ హర్ మహాదేవ్ నినాదంతో ప్రధాని మోదీకి ఘన స్వాగతం.!

#nita-ambani #miss-world #karan-johar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి