CWC: తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక విజ్ఞప్తి

తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలకు ప్రతేక విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పాత్రను గుర్తుచేసుకుంది. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే సమయంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా వాటిని అధిగమించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని ఈ సమావేశంలో ప్రస్తావించింది.

New Update
CWC: తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక విజ్ఞప్తి

CWC: తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలకు ప్రతేక విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పాత్రను గుర్తుచేసుకుంది. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే సమయంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా వాటిని అధిగమించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని ఈ సమావేశంలో ప్రస్తావించింది. గత తొమ్మిది సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాయని పేర్కొంది. కేసీఆర్ రాష్ట్రంలో కుటుంబ పాలనకు తెరలేపి ప్రజా సమస్యలు మర్చిపోయారని తీవ్ర విమర్శలు చేసింది. బంగారు తెలంగాణ కాదు కదా నిజాంల పరిపాలన తీసుకొచ్చారని సీడబ్ల్యూసీ మండిపడింది. రైతులను అప్పుల ఊబిలోకి నెట్టారని, ధరణి పోర్టల్‌తో దివంగత ప్రధాని ఇందిరా గాంధీ సమయంలో ఇచ్చిన భూములను సైతం బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుంటుందని ఆరోపించింది.

తెలంగాణలో విజయం సాధిస్తామని ధీమా..

భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ తెలంగాణలో 405 కిలోమీటర్లు పాదయాత్ర చేశారని గుర్తుచేసింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో చరిత్ర సృష్టించడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని తెలిపింది. 6 గ్యారెంటీలు, డిక్లరేషన్లతో తెలంగాణలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రజలు కాంగ్రె పార్టీకి ఓటు వేయాలని రిక్వెస్ట్ చేసింది. నిజమైన బంగారు తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యమని సీడబ్ల్యూసీ వెల్లడించింది. దీంతో పాటు రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, జమిలీ ఎన్నికలు, పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించినట్లు సమాచారం. ఇక ఇవాళ(ఆదివారం) సాయంత్రం తుక్కుగూడలో జరిగే బహిరంగ సభలో సోనియా గాంధీ ఎన్నికలకు సంబంధించిన ఆరు గ్యారంటీ హామీలను ప్రకటించనున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యనేతల పర్యటన..

మరోవైపు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో సోమవారం పలువురు కాంగ్రెస్ ముఖ్యనేతలు పర్యటించనున్నారు. ఎల్బీనగర్‌లో ఛత్తీస్‌ఘడ్ సీఎం భూపేష్ భగేల్, కామారెడ్డి‌లో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చెరంజిత్ చన్నీ, జడ్చర్లలో రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్, రాజేంద్రనగర్‌లో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్, జూబ్లీహిల్స్‌లో లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్, కుత్బుల్లాపూర్‌లో సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడు సుబ్బిరామిరెడ్డి, ఆదిలాబాద్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, కరీంనగర్‌లో ఏపీ పీసీసీ ఛీఫ్ గిడుగు రుద్రరాజు పర్యటించి ప్రజలతో మమేకం కానున్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ అధిష్టానం పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తుంది. కర్ణాటక స్ట్రాటజీని తెలంగాణలోనూ అమలు చేస్తుంది.

ఇది కూడా చదవండి: తెలంగాణలో పోస్టర్ల రాజకీయం.. బుక్ మై సీఎం.. కానీ షరతులు వర్తిస్తాయి

Advertisment
Advertisment
తాజా కథనాలు