/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/raghu-jpg.webp)
CWC Raghuveera Reddy: కేంద్ర ప్రభుత్వంపై CWC మెంబెర్ రఘువీరారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రధాని మోదీ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కక్షపూరిత ధోరణిని ప్రదర్శిస్తున్నారన్నారు. గతంలో రాహుల్ గాంధీ అనే నిప్పు ఖనికను తాకి ఒళ్ళు కాల్చుకున్నారని.. ఇప్పుడు రాహుల్ గాంధీ లోకసభలో ప్రతిపక్ష నాయకుడని,. ప్రజల గొంతుక, వారి సూచనలు విని ప్రజలకు మేలు చేసే దిశగా కేంద్రం పనిచేయాలని సూచించారు. ED , CBI అంటూ కక్షపూరితంగా వ్యవహరిస్తూ రాహుల్ గాంధీ అనే అగ్నిపర్వతాన్ని తాకే ప్రయత్నం చేస్తే మాడి మసి కాక తప్పదని హెచ్చరించారు రఘువీరారెడ్డి.