AP: రాహుల్‌ జోలికొస్తే మసైపోతారు.. బీజేపీకి CWC రఘువీరారెడ్డి వార్నింగ్

బీజేపీపై CWC మెంబెర్ రఘువీరారెడ్డి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీపై ED, CBI అంటూ మోదీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. రాహుల్ అనే అగ్నిపర్వతాన్ని తాకే ప్రయత్నం చేస్తే మాడి మసి కాక తప్పదని హెచ్చరించారు.

New Update
Raghuveera Reddy : ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇచ్చిన మాట ఏమైంది? జగన్ సర్కార్ పై రఘువీరా ఫైర్

CWC Raghuveera Reddy: కేంద్ర ప్రభుత్వంపై CWC మెంబెర్ రఘువీరారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రధాని మోదీ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కక్షపూరిత ధోరణిని ప్రదర్శిస్తున్నారన్నారు. గతంలో రాహుల్ గాంధీ అనే నిప్పు ఖనికను తాకి ఒళ్ళు కాల్చుకున్నారని.. ఇప్పుడు రాహుల్ గాంధీ లోకసభలో ప్రతిపక్ష నాయకుడని,. ప్రజల గొంతుక, వారి సూచనలు విని ప్రజలకు మేలు చేసే దిశగా కేంద్రం పనిచేయాలని సూచించారు. ED , CBI అంటూ కక్షపూరితంగా వ్యవహరిస్తూ రాహుల్ గాంధీ అనే అగ్నిపర్వతాన్ని తాకే ప్రయత్నం చేస్తే మాడి మసి కాక తప్పదని హెచ్చరించారు రఘువీరారెడ్డి.

Advertisment
తాజా కథనాలు