చట్టాలు ఎంత పటిష్టంగా ఉన్నా ఉన్మాదం వంద రెట్లు అధికంగా ఉంది. ఇటివలి వెలుగుచూస్తున్న ఘటనలు చూస్తే సమాజం ఎటు పోతుందో అర్థంకాని దుస్థితి దాపరించింది. సాటి మనుషులపై ఇంత క్రూరంగా ప్రవర్తించడం చూస్తుంటే అసహ్యమేస్తుంది. వర్తమాన చరిత్ర భవిష్యత్తు ముందు తలవంచుకోని ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మనిషి ఇంత నీచంగా, ఇంత క్రూరంగా, ఇంత దుర్మార్గునిగా, ఒక రాక్షసుడుగా ఎలా మారిపోయాడు..? మూత్రం చుట్టూ జరుగుతున్న నేరాలు దేనికి సంకేతం..? మధ్యప్రదేశ్, ఒంగోలు ఘటనలు ఏం చెబుతున్నాయి..? ఈ రెండు ఘటనలే కాదు..బయటకు రాని ఘటనలు అనేకం ఉన్నాయి. భార్యని మూత్రం తాగమని బలవంతం చేసే శాడిస్టు భర్త నుంచి తక్కువ కులం అబ్బాయి తమ అమ్మాయిని ప్రేమించాడని మూత్రం తాగించే కులోన్మాదుల వరకు ఈ తరహా ఘటనలు నిత్యం ఎక్కడో అక్కడో జరుగుతూనే ఉన్నాయి. వాటిలో కొన్ని ఉదంతాలను గమనిస్తే ఇంత నీచులా వీళ్లంతా అని అనిపించక మానదు..!
పూర్తిగా చదవండి..Crimes: దుర్మార్గుల ఆయుధంగా మూత్రం….మంటగలుస్తున్న మానవత్వం..!
ఇటివలి కాలంలో మూత్రం చుట్టూ నేరాలు పెరిగిపోతున్నాయి. మధ్యప్రదేశ్, ఒంగోలు ఘటనల తరహాలోనే గతంలోనూ సాటి మనుషులపై మూత్రం పోసిన ఘటనలు వెలుగుచూశాయి.

Translate this News: